పెన్పహాడ్ మండలం లాల్సింగ్ తండాకు చెందిన బానోతు ఐశ్వర్యకు సూర్యాపేటలోని ప్రభుత్వ మెడికల్ కళాశాలలో బీఎస్సీ నర్సింగ్ సీటు వచ్చింది. ఐశ్వర్యది వ్యవసాయ కూలీ కుటుంబం. చదువులకు ఖర్చులు భరించే స్థోమత లేకపోవడం తెలుసుకున్న మాజీ మంత్రి, ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీశ్రెడ్డి సోమవారం ఆర్థిక సాయం చేసి ఔదార్యం చాటుకున్నారు. తన ఉన్నత చదువులు పూర్తయ్యే వరకు అండగా ఉంటానని హామీ ఇచ్చారు. టాలెంట్ ఉన్న ఆడబిడ్డకు అండగా నిలువడం తనకు అత్యంత సంతోషాన్ని, సంతృప్తిని ఇచ్చిందని ఈ సందర్భంగా ఎమ్మెల్యే జగదీశ్రెడ్డి పేర్కొన్నారు.
సూర్యాపేట, డిసెంబర్ 11(నమస్తేతెలంగాణ): ఉన్నత చదువులకు ఆర్థిక పరిస్థితి ఆటంకంగా నిలిచిన నిరుపేద గిరిజన విద్యార్థినికి మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీశ్రెడ్డి అండగా నిలిచారు. ఆమె విద్యాభ్యాసం పూర్తి అయ్యే వరకు అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. సూర్యాపేట జిల్లా పెన్పహాడ్ మండలం లాల్సింగ్తండాకు చెందిన బానోతు ఐశ్వర్యం చిన్ననాటి నుంచి చదువులో ప్రతిభను ప్రదర్శిస్తూ వస్తుంది. బీఎస్సీ నర్సింగ్ సీటు ప్రభుత్వ మెడికల్ కళాశాలలోసాధించింది. ఆమెది వ్యవసాయ కూలీ కుటుంబం కావడంతో ఖర్చులు భరించలేని స్థితి. గతంలో అక్కడ పనిచేసిన కాకర్ల రమాదేవి అనే టీచర్ ఆ కుటుంబానికి ఎనిమిదేండ్లుగా ఏటా రూ.10వేలు ఆర్థిక సాయం అందించేవారు.
బీఎస్సీ నర్సింగ్ చదివేందుకు కావాల్సిన డబ్బుల కోసం ఈ విషయాన్ని టీచర్, స్థానిక నాయకులు జగదీశ్రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. ఐశ్వర్యతో పాటు ఆమె తల్లిని సూర్యాపేటకు పిలిపించిన ఎమ్మెల్యే విద్యార్థిని చదువు పూర్తయ్యే వరకు అండగా ఉం టానని హామీ ఇచ్చారు. ఈ మేరకు సోమవారం ఆర్థికసాయం అందించారు. తన నర్సింగ్ విద్యకు సాయం అందించిన ఎమ్మెల్యే జగదీశ్రెడ్డికి ఐశ్వర్య ఆమె కుటుంబ సభ్యులు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
జగదీశన్నకు జీవితాంతం రుణపడి ఉంటానని వైద్యరంగంలో ప్రజలకు సేవ చేసి జగదీశన్న తనపై పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకుంటాని ఐశ్వర్య పేర్కొన్నారు. తోటి విద్యార్థులకు ఐశ్వర్య స్ఫూర్తి నిరుపేద పరిస్థితుల్లో సవాళ్లు దాటుకొని చదు వులో రాణిస్తున్న ఐశ్వర్య తోటి విద్యార్థులకు స్ఫూర్తి అని ఎమ్మెల్యే జగదీశ్రెడ్డి అన్నారు. ప్రజ్ఞా పాటవాలు ఎవరి సొత్తు కాదని, కృషితో ఎలాంటి లక్ష్యం అయినా సాధించవచ్చని ఐశ్వర్య నిరూపిం చిందన్నారు. వైద్యరంగంలో ఆమె ఉన్నతశిఖరా లను అధిరోహించాలని ఆకాంక్షించారు.
సూర్యాపేట రూరల్/ నాగారం/ అడ్డగూడూరు : సూర్యాపేట ఎమ్మెల్యేగా హ్యాట్రిక్ విజయం సాధించిన మాజీ మంత్రి, ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీశ్ రెడ్డిని ఎండ్లపల్లి గ్రామ బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు కలిసి ఘనంగా సన్మానించారు. సోమవారం క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే జగదీశ్రెడ్డిని కలిసి పుష్పగుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు.
అలాగే నాగారం, అడ్డగూడూరు మండలాల బీఆర్ఎస్ నాయకులు సైతం జగదీశ్రెడ్డిని మర్యాదపూర్వకంగా కలసి పుష్పగుచ్ఛం అందించి అభినందనలు తెలిపారు. సూర్యాపేట మండల బీఆర్ఎస్ నాయకులు కుంట్ల సుదర్శన్రెడ్డి, ఉయ్యాల రవి, బుడిగె నవీన్, కుంట్ల భీష్మరెడ్డి, రాంరెడ్డి, జాన య్య, పరుశరాములు, నాగారం బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు కల్లెట్లపల్లి ఉప్పలయ్య, బీఆర్ఎస్వీ జిల్లా కోఆర్డినేటర్ కల్లెట్లపల్లి శోభన్బాబు, జాజిరెడ్డిగూడెం జడ్పీటీసీ దావుల వీరప్రసాద్, నాగార్జున, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ మహేంద్రనాథ్, కందుకూరి ప్రవీణ్కుమార్ పాల్గొన్నారు.