సూర్యాపేట, ఫిబ్రవరి 23(నమస్తేతెలంగాణ) : రాష్ట్రంలో రెండో అతి పెద్ద వ్యవసాయ మార్కెట్ అయిన సూర్యాపేట అభివృద్ధి కమిటీ దాదాపు ఖరారైంది. మార్కెట్ కమిటీ చైర్మన్గా కొప్పుల వేణారెడ్డి, వైస్ చైర్మన్గా ధరావత్ వీరన్ననాయక్, డైరెక్టర్లుగా దాసరి తిరుమల్రావు, నకిరేకంటి బాలకృష్ణ, పచ్చిపాల వెంకన్న, గోపగాని పెద వెంకన్న, మేడిపల్లి దామోదర్,
ఆర్ది కేశవులు, గోగుల పద్మ, చెన్నోజు నర్సింహాచారి, నాగుల శ్రీనివాస్, షేక్ అబ్దుల్ కరీం, వుప్పల సత్యనారాయణ, మాడ్గుల నవీన్ నియమితులయ్యారు. వీరితోపాటు ఈ కమిటీలో అనంతారం పీఏసీఎస్ చైర్మన్, సూర్యాపేట మున్సిపల్ చైర్పర్సన్, జిల్లా మార్కెటింగ్ అధికారి, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి కూడా సభ్యులుగా ఉండనున్నారు. ఇదే కమిటీని మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డికి పంపించగా ఆయన ధ్రువీకరించి ప్రభుత్వానికి పంపారు. నేడో, రేపో జీఓ రానున్నది.