నకిరేకల్, జూన్ 2 : సీఎం కేసీఆర్ నేతృత్వంలో జరుగుతున్న అభివృద్ధిని చూసే వివిధ పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు స్వచ్ఛందంగా బీఆర్ఎస్లో చేరుతున్నారని నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు. నకిరేకల్ పట్టణంలోని క్యాంప్ కార్యాలయంలో శుక్రవారం తాటికల్ గ్రామానికి చెందిన వివిధ పార్టీల నాయకులు, కార్యకర్తలు ఎమ్మెల్యే సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. వారికి ఎమ్మెల్యే గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ సీఎం కేసీఆర్ సారథ్యంలోనే గ్రామాలు అభివృద్ధి చెందుతున్నాయన్నారు.
ప్రతి గులాబీ సైనికుడిని గుండెల్లో పెట్టుకుని చూసుకుంటామన్నారు. గ్రామాలు, పట్టణాలు అనే తేడా లేకుండా అభివృద్ధి జరుగుతందని తెలిపారు. అభివృద్ధి, సంక్షేమ పథకాలకు ఆకర్షితులై ఇతర పార్టీల నుంచి స్వచ్ఛందంగా బీఆర్ఎస్లో చేరుతున్నట్లు చెప్పారు. పార్టీలో చేరిన వారిలో పొల్లెగోని వెంకన్న, కొరివి కృష్ణ, పొల్లెగోని దుర్గయ్య, శంకర్, గంగదేవి అశోక్కుమార్, పొల్లెగోని మురళి, జానయ్య, పెద్ద శంకర్, చిన్న శంకర్, వెంకటేశ్, రాములు, బంటు సురేశ్, బాలరాజు, నర్సింహ తదితరులు ఉన్నారు. కార్యక్రమంలో జడ్పీటీసీ మాద ధనలక్ష్మీ నగేశ్గౌడ్, మున్సిపల్ చైర్మన్ రాచకొండ శ్రీనివాస్గౌడ్, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు ప్రగడపు నవీన్రావు, గ్రామశాఖ అధ్యక్షుడు జానయ్య, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.