ఎకరం పొలం నీళ్లు పారించడానికి గంట కరంట్ చాలని, మొత్తంగా రోజుకు ఎనిమిది గంటల కరంట్ సరిపోతుందంటూ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి చేసిన వ్యాఖ్యలపై వరుసగా రెండో రోజు రైతన్నలు భగ్గుమన్నారు. కాంగ్రెస్ పాలనలో కనీసం తొమ్మిది గంటల కూడా సక్కగ ఇవ్వలేకపోయిన ఆ పార్టీ నేతలకు 24 గంటల ఉచిత కరంట్పై ఎందుకు కడుపుమంట అని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.స్వరాష్ట్రంలో సీఎం కేసీఆర్ నాయకత్వంలో నిరంతర విద్యుత్తో వ్యవసాయం పండుగలా సాగుతుంటే రేవంత్రెడ్డి వంటి కాంగ్రెస్ నేతలకు ఎందుకు గిట్టడం లేదంటూ వీధుల్లోకి వచ్చారు. బుధవారం ఉమ్మడి జిల్లా అంతటా బీఆర్ఎస్ ఆధ్వర్యంలో రైతులు, పార్టీ శ్రేణులు ఆందోళనలు, నిరసన కార్యక్రమాలతో హోరెత్తించారు. గ్రామాల్లోని రైతు వేదికలతోపాటు మండల కేంద్రాల్లో రేవంత్రెడ్డితోపాటు కాంగ్రెస్ పార్టీ దిష్టిబొమ్మలకు శవయాత్రలు నిర్వహించి దహనం చేశారు. ఖబడ్దార్ రేవంత్రెడ్డి.. ఉచిత కరంట్ జోలికొస్తే కరంట్ షాక్ తప్పదంటూ హెచ్చరించారు. పలుచోట్ల ఎమ్మెల్యేల సారథ్యంలో పెద్ద ఎత్తున పార్టీ శ్రేణులు, రైతులు ఆందోళనల్లో భాగస్వాములయ్యారు. కొండమల్లేపల్లిలో పార్టీ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే రవీంద్రకుమార్, నల్లగొండలో ఎమ్మెల్యే కంచర్ల భూపాల్రెడ్డి, మిర్యాలగూడలో ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్రావు, చండూరులో ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్రెడ్డి, అనంతగిరిలో ఎమ్మెల్యే బొల్లం మల్లయ్యయాదవ్ స్వయంగా ఆందోళనలకు నాయకత్వం వహించి కాంగ్రెస్ నేతల తీరును ఎండగట్టారు. ఇక గురువారం నియోజకవర్గ, జిల్లా కేంద్రాల్లో ఆందోళనలు కొనసాగించాలని
బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు శ్రేణులకు పిలుపునిచ్చారు. నేడు విద్యుత్ సబ్స్టేషన్ల వద్ద నిరసన తెలుపనున్నారు.
– నల్లగొండ ప్రతినిధి, జూలై12(నమస్తే తెలంగాణ)
మూడు గంటల కరంట్తో పొలం పారుతదా..
మా ఊర్లో నాకు ఐదెకరాల వ్యవసాయ భూమి ఉంది. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కాలం మంచిగై బోర్లు నిండా పోస్తున్నయి. 24 గంటల కరంట్తో పంటలు బాగా పండుతున్నయి. కాంగ్రెస్ పార్టీ నాయకుడు రేవంత్రెడ్డి రైతులకు ఉచిత కరంట్ అవసరం లేదంటున్నడు. ఎకరానికి ఒక గంట, మూడెకరాలకు మూడు గంటల కరంట్ చాలు అంటున్నాడు. మరి నాలుగు, ఐదు ఎకరాలు ఉన్న రైతులు ఎక్కడికి పోవాలి. నాడు కాంగ్రెస్ హయాంలో 8 గంటలే కరంట్ ఇచ్చేది. అది కూడా పొద్దుగాళ్ల కొంత, రాత్రి కొంత ఇచ్చేది. పొలానికి నీళ్లు పారక ఎండిపోయేది. రాత్రిపూట ఇచ్చే కరంట్ కోసం ప్రాణాలు పణంగా పెట్టి చీకట్లో పొలాలకు పోయేది. ఎన్నో రాత్రిళ్లు బావుల దగ్గరే పడుకున్నం. రైతులను గోస పెట్టిన ఆ పార్టీ మళ్లీ పాత పద్ధతినే ఆలోచిస్తున్నది. రైతు వ్యతిరేక పార్టీ కాంగ్రెస్. రేవంత్రెడ్డిని, ఆ పార్టీ నాయకులను తరిమికొడతాం.
– నోముల పాపులు, రైతు, పాలెం గ్రామం, నకిరేకల్ మండలం
వ్యవసాయానికి 24 గంటల ఉచిత విద్యుత్ అవసరం లేదని, 3 గంటల విద్యుత్ సరిపోతుందని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి చేసిన వ్యాఖ్యలపై బీఆర్ఎస్ నాయకులు, రైతులు మండిపడ్డారు. బుధవారం ఉమ్మడి నల్లగొండ జిల్లా వ్యాప్తంగా బీఆర్ఎస్ ఆధ్వర్యంలో రైతులు, పార్టీ శ్రేణులు ఆందోళనలు, నిరసన కార్యక్రమాలతో హోరెత్తించారు. గ్రామాల్లోని రైతువేదికలతోపాటు మండల కేంద్రాల్లో రేవంత్రెడ్డితోపాటు కాంగ్రెస్ పార్టీ దిష్టిబొమ్మలకు శవయాత్రలు నిర్వహించి దహనం చేశారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ.. ఖబడ్దార్ రేవంత్రెడ్డి.. ఉచిత కరెంటు జోలికొస్తే కరెంటు షాక్ తప్పదంటూ హెచ్చరించారు. పలుచోట్ల ఎమ్మెల్యేల సారథ్యంలో పెద్ద ఎత్తున పార్టీ శ్రేణులు, రైతులు ఆందోళనల్లో భాగస్వాములయ్యారు. చౌటుప్పల్లో జరిగిన నిరసన కార్యక్రమంలో రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్యయాదవ్, కల్లు గీత సహకార సంఘం చైర్మన్ పల్లె రవికుమార్, కొండమల్లేపల్లిలో బీఆర్ఎస్ నల్లగొండ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే రవీంద్రకుమార్, నల్లగొండలో ఎమ్మెల్యే కంచర్ల భూపాల్రెడ్డి, మిర్యాలగూడలో ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్రావు, చండూరులో ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్రెడ్డి, అనంతగిరిలో బొల్లం మల్లయ్యయాదవ్ స్వయంగా ఆందోళనలకు నాయకత్వం వహించి కాంగ్రెస్ నేతల తీరును ఎండగట్టారు. ఆత్మకూరు(ఎం)లో బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు కంచర్ల రామకృష్ణారెడ్డి, గొర్రెలు, మేకల అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ దూదిమెట్ల బాలరాజు యాదవ్ విలేకరుల సమావేశంలో రేవంత్రెడ్డిని తూలనాడారు. నేడు కూడా నిరసనలు కొనసాగనున్నాయి. సబ్స్టేషన్ల వద్ద రైతులు నిరసన వ్యక్తం చేయనున్నారు.
– నల్లగొండ, జూలై 12(నమస్తే తెలంగాణ)