రాష్ట్ర అభివృద్ధి, సంక్షేమ పథకాలు దేశానికే ఆదర్శంగా నిలిచాయని, సీఎం కేసీఆర్తోనే దేశ రాజకీయాల్లో వెలుగులు నిండుతాయని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి అన్నారు. నకిరేకల్ పట్టణానికి చెందిన 6వ వార్డు కౌన్సిలర్తోపాటు 300 మంది యువకులు ఫార్వర్డ్ బ్లాక్ పార్టీని వీడి మంత్రి జగదీశ్రెడ్డి, ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ తెలంగాణ తరహా పాలన, అభివృద్ధి కావాలని ఇతర రాష్ర్టాల ప్రజలు కోరుకుంటున్నారని, జనం ఆకాంక్షతోనే బీఆర్ఎస్ పార్టీ ఉద్భవించి దేశ వ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తున్నదని అన్నారు. ప్రధాని మోదీ చేతగానితనం వల్లే దేశంలో చీకటి అలుముకుందని, తెలంగాణ రాష్ట్రంలో వ్యవసాయానికి 24 గంటల కరెంట్ ఉచితంగా ఇస్తుంటే గుజరాత్లో మాత్రం 6 గంటలు అది కూడా మీటర్లు పెట్టి ఇస్తున్నారని చెప్పారు. సీఎం కేసీఆర్ సారథ్యంలో రాష్ట్రం సుభిక్షంగా మారిందని, కేంద్రంలోని బీజేపీ పాలనతో దేశంలో35 శాతం మంది ఆకలితో అలమటిస్తున్నారని అన్నారు.
– నకిరేకల్, జనవరి 22
విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్రెడ్డి
నకిరేకల్, జనవరి 22 : సీఎం కేసీఆర్తోనే దేశ రాజకీయాల్లో వెలుగులు నిండుతాయని విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి అన్నారు. పట్టణంలోని ఇందిరాగాంధీ మెయిన్ సెంటర్లో మంత్రి జగదీశ్రెడ్డి, ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య సమక్షంలో 6వ వార్డు కౌన్సిలర్ మట్టిపల్లి కవితావీరు, యువ నాయకుడు చిట్యాల అశోక్తో పాటు 300 మంది యువకులు ఫార్వార్డ్ బ్లాక్ పార్టీని వీడి బీఆర్ఎస్ పార్టీలో ఆదివారం చేరారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో మంత్రి జగదీశ్రెడ్డి మాట్లాడుతూ పార్టీలో చేరిన వారందరికీ సమ ప్రాధాన్యం ఉంటుందన్నారు. నిజం నిప్పు లాంటిదని ఎవరెన్ని దుష్ర్పచారాలు చేసినా వాటిని నమ్మే స్థితిలో ప్రజలు లేరన్నారు. దేశ ప్రజల ఆకాంక్షతోనే బీఆర్ఎస్ పార్టీ ఉద్భవించిందన్నారు. బీఆర్ఎస్ పార్టీ దేశ రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టించిందన్నారు. రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధినే దేశమంతా ఆచరిస్తోందని తెలిపారు. మోడీ చేతగానితనం వల్లే దేశంలో చీకటి అలుముకుందని విమర్శించారు. తెలంగాణ మాదిరిగా 24గంటల కరెంటు తమకెందుకు ఇవ్వడం లేదని దేశ ప్రజలు మోదీని ప్రశ్నిస్తున్నారన్నారు.
గ్రామాలు, పట్టణాలు అనే తేడా లేకుండా రాష్ట్రంలో అభివృద్ధి జరుగుతుందన్నారు. నకిరేకల్ అభివృద్ధే చిరుమర్తి లింగయ్య నినాదమన్నారు. ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య మాట్లాడుతూ మంత్రి జగదీశ్రెడ్డి సహకారంతోనే నియోజకవర్గ అభివృద్ధి జరుగుతున్నదన్నారు. ముసుగు దొంగలతో పార్టీ ప్రతిష్ఠకు భంగం కలుగుతున్నదని, అలాంటి వారిని పార్టీ దరిదాపుల్లోకి సైతం రానివ్వరాదన్నారు.
పార్టీ కోసం కష్టపడే ప్రతి కార్యకర్తకు అండగా ఉంటామన్నారు. అంతకుముందు భారీ ర్యాలీ తీశారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ రాచకొండ శ్రీనివాస్గౌడ్, జడ్పీటీసీ మాద ధనలక్ష్మీనగేశ్గౌడ్, మార్కెట్ కమిటీ చైర్మన్ కొప్పుల ప్రదీప్రెడ్డి, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు ప్రగడపు నవీన్రావు, ప్రధాన కార్యదర్శి నోముల కేశవరాజు, పట్టణాధ్యక్షుడు యల్లపురెడ్డి సైదిరెడ్డి, మున్సిపల్ వైస్ చైర్మన్ మురారిశెట్టి ఉమారాణీకృష్ణమూర్తి, సింగిల్ విండో చైర్మన్ పల్రెడ్డి మహేందర్రెడ్డి, వైస్ చైర్మన్ నాగులవంచ వెంకటేశ్వర్రావు, ముత్యాలమ్మ గుడి చైర్మన్ నడికుడి వెంకటేశ్వర్లు, నాయకులు పెండెం సదానందం, గుర్రం గణేశ్, దైద పరమేశ్, దైద అఖిల్, కౌన్సిలర్లు పాల్గొన్నారు.
మంత్రి జగదీశ్రెడ్డి సమక్షంలో చేరికలు
సూర్యాపేట రూరల్ : తెలంగాణ రాష్ట్రంలో జరిగిన అభివృద్ధి వైపే దేశం మొత్తం చూస్తున్నదని విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి అన్నారు. పట్టణంలోని 12వ వార్డు పిల్లలమర్రిలో ఆదివారం ఆయన సమక్షంలో వార్డు కౌన్సిలర్ బచ్చలకూరి శ్రీనివాస్ 200మంది కార్యకర్తలతో కలిసి చేరారు. రాష్ట్రంలో జరిగిన అభివృద్ధి దేశంలో ఎక్కడ జరిగలేదన్నారు. ప్రధాని మోదీ సొంత రాష్ట్రమైన గుజరాత్లో సాగుకు 6గంటల విద్యుత్నే ఇస్తున్నారన్నారు. అక్కడి ప్రజలు దాహం కేకలతో అల్లాడిపోతున్నారన్నారు.
సీఎం కేసీఆర్ పేదల జీవితాల్లో వెలుగులు నింపుతుంటే, ప్రధాని మోదీ పాలనలో 35శాతం మంది ప్రజలు ఆకలితో అలమటిస్తున్నారని విమర్శించారు. ఒకరిద్దరిని మరింత సంపన్నులుగా మార్చేందుకే ప్రధాని మోదీ పాలన సాగుతున్నదన్నారు. దేశ ప్రజలంతా సీఎం పాలన కోసం ఎదురుచూస్తున్నారని తెలిపారు. బీఆర్ఎస్ యువ నాయకుడు రాపర్తి మహేశ్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి వై.వెంకటేశ్వర్లు, మున్సిపల్ చైర్మన్ పెరుమాళ్ల అన్నపూర్ణ, జడ్పీ వైస్ చైర్మన్ గోపగాని వెంకటనారాయణగౌడ్, జిల్లా గ్రంథాలయ చైర్మన్ నిమ్మల శ్రీనివాస్గౌడ్ పాల్గొన్నారు.