నందికొండ, సెప్టెంబర్ 22 : శ్రీశైలం రిజర్వాయర్ నుంచి నాగార్జునసాగర్ రిజర్వాయర్కు గురువారం 1,38,108 క్యూసెక్కుల ఇన్ఫ్లో కొనసాగడంతో నాగార్జునసాగర్ డ్యాం 6 క్రస్ట్ గేట్లను 5 అడుగుల మేర ఎత్తి 47,970 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. సాగర్ పూర్తి స్థాయి నీటి మట్టం 590(312 టీఎంసీలు) అడుగకులకు 589(309.0570 టీఎంసీలు) అడుగుల మేర నీరు నిల్వ ఉంది. రిజర్వాయర్ కుడి కాల్వ ద్వారా 10,567 క్యూసెక్కులు, ఎడమ కాల్వ ద్వారా 5,156 క్యూసెక్కులు, ప్రధాన జల విద్యుత్ కేంద్రం ద్వారా 32,358 క్యూసెక్కులు, ఎస్ఎల్బీసీ ద్వారా 1,800 క్యూసెక్కులు, ఎల్ఎల్సీ ద్వారా 400 క్యూసెక్కుల నీరు విడుదలవుతుంది. మొత్తం 98,251 క్యూసెక్కుల అవుట్ఫ్లో కొనసాగుతుంది.
2 క్రస్ట్ గేట్ల ద్వారా మూసీ నీటి విడుదల..
కేతేపల్లి : మూసీ ప్రాజెక్టుకు ఎగువ ప్రాంతాల నుంచి గురువారం 1,865.13 క్యూసెక్కుల ఇన్ఫ్లో కొనసాగింది.ప్రాజెక్టు 2 క్రస్టు గేట్ల ద్వారా 1,262.14 క్యూసెక్కుల నీరు దిగువకు వెళ్తుంది. కుడి కాల్వకు 323.68, ఎడమ కాల్వకు 323.68 క్యూసెక్కుల నీటిని వదిలారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 645 అడుగులు(4.46 టీఎంసీలు)కాగా ప్రస్తుతం 642.70 అడుగులు(3.87 టీఎంసీలు)ఉన్నట్లు ఏఈ ఉదయ్కుమార్ తెలిపారు.