కేతేపల్లి, జూన్ 10 : మూసీ ప్రాజెక్టుకు ఎగువ ప్రాంతాల నుంచి సోమవారం 534.48 క్యూసెక్కుల ఇన్ఫ్లో కొనసాగింది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 645 అడుగులు(4.46 టీఎంసీలు)కాగా, ప్రస్తుతం 636.70 అడుగులు(2.51 టీఎంసీలు) ఏఈ డి.ఉదయ్కుమార్ తెలిపారు. గత వారం రోజులుగా ఇన్ఫ్లో నిలకడగా 500 క్యూసెక్కులకు పైగా వస్తున్నది.
ఎగువ ప్రాంతాల్లో గత నెల, ఈ నెలలో కురిసిన వర్షాల వల్ల ప్రాజెక్టులోకి ఇన్ఫ్లో కొనసాగుతూ వస్తున్నది. ఏప్రిల్లో ప్రాజెక్టు కుడి, ఎడమ కాల్వలకు నీటి విడుదల నిలిపి వేసిన సమయం నుంచి ఇప్పటి వరకు సుమారు17 అడుగుల మేర ప్రాజెక్టు నీటిమట్టం పెరిగింది. ఇన్ఫ్లో ఇదే స్థాయిలో కొనసాగితే ఈ నెల చివరి వరకు నీటిమట్టం 640 అడుగులకు పెరిగే అవకాశం ఉంది. ప్రాజెక్టులో నీటిమట్టం పెరుగుతుండటం, వానకాలం సీజన్ ప్రారంభం కావడంతో అధికారులు కాల్వలకు నీటిని విడుదల చేయాలని రైతులు కోరుతున్నారు.