నాగారం/ శాలిగౌరారం, నవంబర్ 28 : తుంగతుర్తి నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీకి పెద్ద షాక్ తగిలింది. తుంగతుర్తి, నాగా రం, శాలిగౌరారం మండలాల నుంచి సుమారు 500 మంది నాయకులు సోమవారం టీఆర్ఎస్లో చేరారు.
హైదరాబాద్లోని మినిస్టర్ క్వార్టర్స్లో విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి, ఎమ్మెల్యే గాదరి కిశోర్కుమార్ సమక్షంలో నాగారం మండలం ఫణిగిరి గ్రామానికి చెందిన పీసీసీ రాష్ట్ర కార్యదర్శి ఎర్ర యాదగిరి, ఉప సర్పంచ్ ఎర్ర నరేశ్, వార్డు సభ్యులు ఉపేంద్ర, బెల్లం శారద, యూత్ మండలాధ్యక్షుడు ఎర్ర బాబు, యూత్ వైస్ ప్రెసిడెంట్ ఎర్ర అంబేద్కర్, తుంగతుర్తి మండలం సంగెం గ్రామ సర్పంచ్ ఏశమళ్ల సుశీలాసామేలు, కాంగ్రెస్ యూత్ నాయకులు సృజన్, సుధీర్, రామచంద్రు, శ్రీనివాస్, శాలిగౌరారం మండలంలోని ఎన్జీకొత్తపల్లి వార్డు సభ్యులు సంకటి మల్లయ్య, బూడిద నర్సయ్య, సంకటి శ్రీను, మాజీ ఉప సర్పంచ్ బూడిద సాయిలు, రావుల శంకర్, సైదులు, ఇటుకలపహాడ్ గ్రామం నుంచి చివుట సైదులు, విద్యా కమిటీ చైర్మన్ అంబటి రమేశ్తో పాటు 500మంది నాయకులు టీఆర్ఎస్లో చేరారు.
కార్యక్రమంలో తిరుమలగిరి మున్సిపల్ చైర్పర్సన్ పోతరాజు రజినీరాజశేఖర్, టీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు గుజ్జ యుగంధర్రావు, టీఆర్ఎస్వీ జిల్లా కోఆర్డినేటర్ కల్లెట్లపల్లి శోభన్బాబు, టీఆర్ఎస్ నాగారం, తుంగతుర్తి, శాలిగౌరారం మండలాధ్యక్షులు కల్లట్లపల్లి ఉప్పలయ్య, తాటికొండ సీతయ్య, ఐతగోని వెంకన్న, తిరుమలగిరి మార్కెట్ కమిటీ మాజీ వైస్ చైర్మన్ గుండగాని అంబయ్య, నాయకులు ఈదుల కిరణ్కుమార్, దోమల బాలమల్లు, కేశగాని అంజయ్య, పొదిల రమేశ్, చంద్రమౌళి, నర్సింహారెడ్డి, ఆంజనేయులు, అంజయ్య, చిరంజీవి, యాదగిరి, శ్రీనివాస్, వెంకన్న, రమేశ్, ఉప సర్పంచ్, గుడిపాటి సైదులు, రాములు, రమేశ్, రాజు, మహేశ్ పాల్గొన్నారు.