రామగిరి, మే 29 : మహాత్మాగాంధీ యూనివర్సిటీ పరిధిలో ఉమ్మడి నల్లగొండ జిల్లా వ్యాప్తంగా నిర్వహిస్తున్న డిగ్రీ 2వ సెమిస్టర్ రెగ్యులర్, 6వ సెమిస్టర్ బ్యాక్లాగ్ పరీక్షల్లో గురువారం 38 మంది విద్యార్థులు మాల్ ప్రాక్టీస్కు పాల్పడుతుండగా ఆయా పరీక్షల కేంద్రాలను తనిఖీ చేసిన స్క్వాడ్ బృందాలు డీబార్ చేసినట్లు ఎంజీయూ పరీక్షల నియంత్రణ అధికారి డాక్టర్ జి.ఉపేందర్రెడ్డి తెలిపారు.
ఉదయం జరిగిన 2వ సెమిస్టర్ పరీక్షలకు 7,223 మంది విద్యార్థులకు 6,358 మంది విద్యార్థులు హాజరు కాగా 838 గైర్హాజరయ్యారు. ఈ పరీక్షలో 26 మంది డీబార్ అయ్యారు. నల్లగొండలోని సిద్ధార్థ డిగ్రీ కళాశాలలో ఇద్దరు, డీవీఎం కాలేజీ ఆఫ్ ఎడ్యుకేషన్లో ఒకరు, రామన్నపేట లోని శ్రీ హిందూ డిగ్రీ కళాశాలలో ఒకరు, మాల్ లోని శ్రీ వేకటేశ్వర డిగ్రీ కళాశాలలో 9 మంది, దేవరకొండలోని భవిత డిగ్రీ కళాశాలలో ఇద్దరు, భువనగిరిలోని జాగృతి డిగ్రీ కళాశాలలో ఒక్కరు, ఎస్ ఎల్ ఎన్ ఎస్ డిగ్రీ కళాశాలలో ఒక్కరు, మిర్యాలగూడలోని హాసిత ఉమెన్స్ డిగ్రీ కళాశాలలో ఒక్కరు, సూర్యాపేటలోని రాకేశ్ బీఈడీ కళాశాలలో 8 మంది విద్యార్థులు డీబార్ అయ్యారు.
అలాగే మధ్యాహ్నం జరిగిన ఆరో సెమిస్టర్ పరీక్షలకు 2,404 మంది విద్యార్థులు హాజరు కావాల్సి ఉండగా 2,111 హాజరయ్యారు. 282 గైర్హాజరయ్యారు. ఈ పరీక్షల్లో 12 మంది డీబార్ అయ్యారు. నల్లగొండలోని సిద్ధార్థ డిగ్రీ కళాశాలలో ముగ్గురు, కాకతీయ డిగ్రీ కళాశాలలో ఒక్కరు, డీవీఎం కాలేజీ ఆఫ్ ఎడ్యుకేషన్లో ఒక్కరు, హుజూర్నగర్లోని ప్రియదర్శని డిగ్రీ కళాశాలలో ఇద్దరు, కోదాడలోని త్రివేణి డిగ్రీ కళాశాలలో ఒక్కరు, మిర్యాలగూడలోని హాసిత ఉమెన్స్ డిగ్రీ కళాశాలలో ఒక్కరు, భువనగిరిలోని స్టాండ్ఫర్డ్ ఉమెన్స్ డిగ్రీ కళాశాలలో ఇద్దరు, సూర్యాపేటలోని రాకేశ్ బీఈడీ కళాశాలలో ఓ విద్యార్థి డీబార్ అయ్యాడు.