జేసీఐ సిల్వర్ జూబ్లీ వేడుకల్లో మంత్రి జగదీశ్రెడ్డి
బొడ్రాయిబజార్, ఫిబ్రవరి 16 : స్వచ్ఛంద సంస్థల కృషి అభినందనీయమని మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి అన్నారు. జిల్లా కేంద్రంలో ఐఎంఎం ఫంక్షన్హాల్లో మంగళవారం రాత్రి నిర్వహించిన జూనియర్ చాంబర్ ఇంటర్నేషనల్(జేసీఐ) సిల్వర్ జూబ్లీ వేడుకల్లో మంత్రి పాల్గొన్నారు. జేసీఐ అధ్యక్షుడిగా ఆంగోతు బావ్సింగ్తో ప్రమాణస్వీకారం చేయించి మాట్లాడారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. స్వచ్ఛంద సంస్థల ద్వారానే సమాజంలో మార్పు, చైతన్యం ఉంటుందన్నారు. దశాబ్దాల తరబడిగా జూనియర్ చాంబర్ ఇంటర్నేషనల్ సంస్థ చేస్తున్న కృషి అభినందనీయమన్నారు. జేసీఐ భవిష్యత్లో మరిన్ని సామాజిక సేవా కార్యక్రమాలు చేపట్టాలని కోరారు. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ నిమ్మల శ్రీనివాస్గౌడ్, మున్సిపల్ వైస్ చైర్మన్ పుట్ట కిశోర్, జేసీఐ ప్రధాన కార్యదర్శి శ్రీకాంత్, ట్రెజరర్ కస్తూరి నవీన్, జోన్ అధ్యక్షుడు దడిగుల రమేశ్, వైస్ ప్రెసిడెంట్ శ్రీనివాస్రావు, పెద్దిరెడ్డి గణేశ్, గండూరి కృపాకర్ పాల్గొన్నారు.
ఆర్థిక సాయం అభినందనీయం
బొడ్రాయిబజార్ : బధిరుల పాఠశాలకు ఆర్థిక సాయం అందించడం అభినందనీయమని మంత్రి అన్నారు. సీఎం కేసీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకుని చల్లా లక్ష్మీకాంత్ చేసిన రూ.10,116 ఆర్థిక సాయాన్ని మంత్రి స్థానిక క్యాంప్ కార్యాలయంలో పాఠశాలకు అందజేశారు. కార్యక్రమంలో జడ్పీటీసీ భూక్యా సంజీవ్నాయక్, టీఆర్ఎస్ జిల్లా నాయకులు ఉప్పల ఆనంద్, తోట శ్యామ్, చల్లా లక్ష్మీప్రసాద్ పాల్గొన్నారు.
వన దేవతలను దర్శించుకున్న మంత్రి
పెన్పహాడ్ : భక్తుల కొంగు బంగారంగా పేరొందిన మండలంలోని గాజులమల్కాపురం సమ్మక్క-సారలమ్మ జాతర అంగరంగ వైభవంగా ప్రారంభమైయ్యాయి. మంత్రి జగదీశ్రెడ్డి వనదేవతలను దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. వన దేవతల గద్దె వద్దకు గ్రామస్తులు ఇంటికో బోనం, పసుపు కుంకుమ, గాజులు, యాటలు, కోళ్లు, బంగారం(బెల్లం) తీసుకువచ్చి మొక్కులు తీర్చుకున్నారు. ఆలయ అభివృద్ధికి సహకరించాలని చైర్మన్ వెంకట్రెడ్డి, సర్పంచ్ ధనమ్మారామకృష్ణారెడ్డి కోరగా మంత్రి సానుకూలంగా స్పందించారు. కార్యక్రమంలో ఎంపీపీ నెమ్మాది భిక్షం ఎంపీటీసీ జ్యోతి పాల్గొన్నారు.