తుంగతుర్తి, ఫిబ్రవరి 16 : ఉద్యమ నేత, రాష్ట్ర అభివృద్ధి ప్రదాత సీఎం కేసీఆర్పై ఇష్టమొచ్చినట్లు వ్యాఖ్యలు చేస్తే రేవంత్రెడ్డిని ప్రజలు తరిమి కొడతారని తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిశోర్కుమార్ అన్నారు. బుధవారం మండల కేంద్రంలో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడారు. ప్రజలు తిరస్కరించిన పార్టీకి అధ్యక్షుడిగా ఉండి సీఎం కేసీఆర్పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే తెలంగాణ సమాజం ఊరుకోదన్నారు. ప్రవర్తన మార్చుకోక పోతే రేవంత్రెడ్డిని బట్టలూడదీసి కొడతారని హెచ్చరించారు. రేవంత్రెడ్డి ఎంత బ్లాక్ మెయిల్.. దొంగో తెలంగాణలో అందరికీ తెలుసన్నారను. చంద్రబాబు కోవర్టుగా మారి పని చేస్తున్నాడంటూ కాంగ్రెస్ పార్టీ నాయకులే అతడిని విమర్శిస్తున్నారని పేర్కొన్నారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు గుజ్జ యుగంధర్రావు, టీఆర్ఎస్వీ జిల్లా కోఆర్డినేటర్ కల్లెట్లపల్లి శోభన్బాబు, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు తాటికొండ సీతయ్య, నాయకులు ఎస్ఏ రజాక్, సోమేశ్వర్గౌడ్, రఘునందన్రెడ్డి, యాకూబ్రెడ్డి, ఉప్పలయ్య, మార్కెట్ కమిటీ చైర్మన్ పులుసు యాదగిరిగౌడ్, తిరుమలగిరి మున్సిపల్ చైర్పర్సన్ రజిని, గుండగాని రాములుగౌడ్, తునికి సాయిలుగౌడ్, ఎంపీటీసీ చెరకు సృజనాపరమేశ్, టీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.
రేవంత్ నోరు అదుపులో పెట్టుకో
హుజూర్నగర్ : సీఎం కేసీఆర్పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ఊరుకోబోం.. రేవంత్రెడ్డి ఒళ్లు దగ్గర పెట్టుకొని మాట్లాడూ అని హుజూర్నగర్ ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి హెచ్చరించారు. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి దిష్టి బొమ్మను బుధవారం హుజూర్నగర్లోని ఇందిరాచౌక్లో టీఆర్ఎస్ ఆధ్వర్యంలో దహనం చేశారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొని మాట్లాడారు. సీఎం కేసీఆర్పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ప్రజలు తగ్గిన రీతిలో బుద్ధి చెబుతారని పేర్కొన్నారు. ఓటు నోటు కేసులో అడ్డంగా దొరికిన దొంగ రేవంత్రెడ్డి అన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ గెల్లి అర్చనారవి, వైస్ చైర్మన్ జక్కుల నాగేశ్వరరావు, ఎంపీపీ గూడెపు శ్రీనివాస్, టీఆర్ఎస్ పట్టణాధ్యక్షుడు అమర్నాథ్రెడ్డి, ప్రధానకార్యదర్శి బెల్లకొండ అమర్, మున్సిపల్ మాజీ చైర్మన్ దొంతగాని శ్రీను, కౌన్సిలర్లు మంగమ్మ, కేఎల్ఎన్ రావు, అల్లూరి హరిబాబు, తండుహరికృష్ణ, నగేశ్, మున్నా, షఫీ, రామకృష్ణ, కవిత, నరసింహారావు, ప్రదీప్ పాల్గొన్నారు.