నాంపల్లి, అక్టోబర్ 22: యువత సంక్షేమానికి టీఆర్ఎస్ పెద్దపీట వేస్తుందని విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. టీఆర్ఎస్ యువజన విభాగంలో ఆధ్వర్యంలో మండలంలోని పసునూరు గ్రామంలో శనివారం ఏర్పాటు చేసిన ఆత్మీయ సమ్మేళనంలో ఆమె మాట్లాడారు. ఈ సందర్భంగా గ్రామాభివృద్ధిని గురించి యువకులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ బీజేపీ ఎంత ఖర్చు పెట్టిన మునుగోడు ఉప ఎన్నికలో గెలవదని అన్నారు.
ఉప ఎన్నికలో టీఆర్ఎస్ జెండా ఎగురడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. టీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను ప్రజలకు వివరించి చైతన్యం చేయాలని యువకులు, పార్టీ శ్రేణులకు నిర్దేశం చేశారు. రాజగోపాల్రెడ్డి స్వలాభం కోసం కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి బీజేపీలో చేరనున్నారు. మునుగోడు నియోజకవర్గ ప్రజలు ఆలోచన చేసి ఈ ఎన్నికలో ఈ సందర్భంగా కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపిస్తామని గ్రామ యువకులు హామీ ఇచ్చారు. గ్రామంలో ఉన్న సమస్యలను, యువకులకు కావాల్సిన సాయం తాము దగ్గరుండి చూసుకుంటామని పేర్కొన్నారు. ఆత్మీయ సమావేశంలో జడ్పీటీసీ ఎలుగోటి వెంకటేశ్వరరెడ్డి, సీపీఐ జిల్లా నాయకులు అంజచారి, నాయకులు పోగుల వెంకట్ రెడ్డి, మండల కో ఆప్షన్ సభ్యుడు ఎస్కే అబ్బాస్, సర్పంచులు, ఉప సర్పంచులు పాల్గొన్నారు.