ఆదిలాబాద్ : జిల్లాలోని ప్రముఖ పర్యాటక ప్రాంతం కుంటాల జలపాతం సందర్శన ఆదివారం నుంచి రద్దు చేస్తున్నట్లు అటవీ రేంజ్ అధికారి వాహబ్ అహ్మద్ తెలిపారు. కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తున్న నేపథ్యంలో ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు జలపాతం పరిసరాల్లో లాక్డౌన్ విధిస్తున్నట్లు ప్రకటించారు. సందర్శకులు ఈ విషయాన్ని గమనించి, అటవీశాఖాధికారులకు, సిబ్బందికి సహకరించాలని ఆయన కోరారు. కార్యక్రమంలో ఎఫ్బీవో రాధాకృష్ణ, సిబ్బంది ఉన్నారు.