24న కొంపల్లిలో ప్రారంభం
హైదరాబాద్, జూన్ 21: ప్రముఖ జ్యువెల్లరీ సంస్థ మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ హైదరాబాద్లో పదో షోరూమ్ను ప్రారంభించనుంది. కొంపల్లిలో సుచిత్ర సర్కిల్లో 3500 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఏర్పాటుచేసిన తమ షోరూమ్ను జూన్ 24న ప్రారంభించనున్నట్లు మలబార్ గోల్డ్ ఒక ప్రకటనలో తెలిపింది. ఈ సోమవారం నుంచే షోరూమ్ ప్రివ్యూషో మొదలయ్యిందని, భద్రతా ప్రొటోకాల్ను పాటిస్తూ సురక్షితమైన షాపింగ్ వాతావరణాన్ని అందిస్తామని, సిబ్బంది అంతటికీ టీకాలు ఇచ్చామని సంస్థ వివరించింది. బంగారం, డైమండ్, ప్లాటినంలతో తయారుచేసిన వివాహ, సాంప్రదాయ, నిత్యంధరించే ఆభరణాలు తమ షోరూమ్లో లభిస్తాయని మలబార్ గోల్డ్ తెలిపింది.