కోల్కతా : పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ప్రతిపక్ష నేతగా బీజేపీ ఎమ్మెల్యే సువేందు అధికారి పేరు ఖాయమైనట్లు తెలుస్తోంది. ప్రతిపక్ష నాయకుడిని ఎంపిక చేసేందుకు బీజేపీ అధిష్టానం కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్, పార్టీ జాతీయ జనరల్ సెక్రటరీ భూపేందర్ యాదవ్ను నియమించిన విషయం విదితమే.
294 అసెంబ్లీ స్థానాలకు గానూ బీజేపీ 77 స్థానాల్లో గెలుపొందగా, ప్రతిపక్ష నాయకుడి పోస్టుకు సువేందు అధికారితో పాటు మనోజ్ తిగ్గా, ముకుల్ రాయ్ కూడా పోటీలో ఉన్నారు. కానీ పార్టీ అధిష్టానం మాత్రం సీఎం మమతా బెనర్జీపై గెలిచిన సువేందు వైపే మొగ్గు చూపినట్లు తెలుస్తోంది. మమతపై 1956 ఓట్ల తేడాతో సువేందు గెలిచారు. బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్ 213 స్థానాల్లో గెలిచి మరోసారి అధికారాన్ని కైవసం చేసుకుంది.