తిరువనంతపురం : ప్రముఖ మళయాళ నటి, ఫిల్మ్ మేకర్ అంబికా రావు కొచ్చిలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో మరణించారు. 58 ఏండ్ల అంబిక చాలా కాలంగా కిడ్నీ సంబంధిత అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఆమె ఇటీవల కొవిడ్-19 బారినపడి కోలుకున్నారు. అంబికా రావు మరణం పట్ల నటులు మోహన్ లాల్, మమ్ముట్టి, పృథ్వీరాజ్ సుకుమారన్ సహా పలువురు ప్రగాఢ సంతాపం తెలిపారు.
అంబికా రావు మరణంతో మళయాళ సినీ పరిశ్రమ ఓ దిగ్గజ నటి, ఫిల్మ్ మేకర్ను కోల్పోయిందని వారు పేర్కొన్నారు. 2000 సంవత్సరంలో అంబిక అసిస్టెంట్ డైరెక్టర్గా సినీ పరిశ్రమలో తన కెరీర్ను ప్రారంభించారు. బాలచంద్ర మీనన్, అన్వర్ రషీద్, షఫీ, వినయన్ వంటి దిగ్ధర్శకుల వద్ద ఆమె పనిచేశారు.
సినిమాలకు దర్శకత్వం వహించడంతో పాటు పలు సినిమాల్లో అంబిక నటించారు. వైరస్, కుంబలంగి నైట్స్ వంటి సినిమాల్లో ఆమె నటనకు ప్రేక్షకులు, విమర్శకుల నుంచి ప్రశంసలు దక్కాయి. అంబికా రావు కుటుంబానికి దర్శకులు, నటులు, మళయాళ సినీ పరిశ్రమ సభ్యులు ప్రగాఢ సానుభూతి తెలిపారు.