ముంబై : బాలీవుడ్ దర్శక నిర్మాత కరణ్ జోహార్ 50వ బర్త్డే వేడుకలు ముంబైలో ఘనంగా నిర్వహించేందుకు సన్నాహాలు ఊపందుకున్నాయి. మే 25న కరణ్ జోహార్ 50వ ఏట అడుగుపెడుతుండగా బాలీవుడ్ దిగ్గజాలకు యష్రాజ్ ఫిల్మ్ స్టూడియోలో గ్రాండ్ పార్టీ ఏర్పాటు చేస్తున్నారు.
ఈ ఏడాది యష్రాజ్ స్టూడియోలో పార్టీ జరుగుతుందని బాలీవుడ్ ప్రముఖులంతా విందుకు హాజరుకానున్నారని కరణ్ సన్నిహిత వర్గాలు వెల్లడించాయి. ధర్మ ప్రొడక్షన్స్లో పనిచేసిన దర్శకులంతా ఈ పార్టీకి హాజరవుతారు. బాలీవుడ్ సూపర్స్టార్స్ షారుక్ ఖాన్, సల్మాన్ ఖాన్లతో పాటు రణ్బీర్కపూర్-అలియా భట్, రణ్వీర్సింగ్-దీపికా పడుకోన్ ఈ పార్టీలో సందడి చేయనున్నారు.
ఇక కరణ్ జోహార్ ఐదేండ్ల తర్వాత మళ్లీ మెగాఫోన్ పట్టారు. రాకీ ఔర్ రాణీ ప్రేం కహానీతో ఆయన డైరెక్టర్గా ముందుకొస్తున్నారు. రణ్వీర్ సింగ్, అలియా భట్, ధర్మేంద్ర, జయా బచ్చన్, షబనా అజ్మీ ప్రధాన తారాగణంగా ఈ మూవీ తెరకెక్కనుంది.