ఉప్పల్, మే 26 : ప్రజల ఆరోగ్య సంరక్షణకు కృషి చేస్తున్నట్లు ఉప్పల్ ఎమ్మెల్యే బేతి సుభాష్రెడ్డి తెలిపారు. ఉప్పల్ డివిజన్లోని పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని బుధవారం ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా దవాఖానను సందర్శించి, వ్యాక్సినేషన్, కరోనా టెస్టులు, మందుల సరఫరా, వైద్యసేవల వివరాలు వైద్య సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ప్రజలకు ఇబ్బందులు లేకుండా చూడాలని వైద్యులకు సూచించారు. కరోనా వైరస్ వ్యాప్తి నివారణకు ప్రజలు సహకరించాలని కోరారు. భౌతికదూరం పాటిస్తూ, కొవిడ్ నిబంధనలు పాటించాలని సూచించారు. ప్రజలు అప్రమత్తంగా ఉంటూ, తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ప్రజల రక్షణకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకొంటున్నదని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ సౌందర్యలత, నేతలు గడ్డం రవికుమార్, గరిక సుధాకర్, లక్ష్మీనారాయణ, శివ, శాగ రవీందర్ తదితరులు పాల్గొన్నారు.