చర్లపల్లి, జూలై 14 : పేద ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారని ఉప్పల్ ఎమ్మెల్యే బేతి సుభాశ్రెడ్డి అన్నారు. బుధవారం చర్లపల్లి డివిజన్కు చెందిన లబ్ధిదారులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను ఆయన అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎం రిలీఫ్ ఫండ్ పేదలకు వరంలాంటిదని, ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. పేదల ఆరోగ్య పరిరక్షణ కోసం రాష్ట్ర వ్యాప్తంగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను సీఎం కేసీఆర్ ఏర్పాటు చేయడంతో పాటు గ్రేటర్ పరిధిలో బస్తీ దవాఖానలను ఏర్పాటు చేశారని ఆయన గుర్తు చేశారు. పేదల సంక్షేమం కోసం పలు సంక్షేమ కార్యక్రమాలను ప్రభు త్వం చేపడుతుందన్నారు. కార్యక్రమంలో నాయకులు డప్పు గిరిబాబు, ఎంపెల్లి పద్మారెడ్డి, తూర్పాటి హనుమంతు, కర్రె సత్యనారాయణ, రెడ్డినాయక్, గరిక సుధాకర్ పాల్గొన్నారు.
నియోజకవర్గ పరిధిలోని కాలనీలను సమగ్రాభివృద్ధికి నిధులు కేటాయించి పనులు చేపడుతున్నామని ఎమ్మెల్యే పేర్కొన్నారు. చర్లపల్లి డివిజన్ వెంకటరెడ్డినగర్ నూతన కార్యవర్గం ఎన్నికైన సందర్భంగా బుధవారం కాలనీ సంక్షేమ సంఘం నాయకులు ఎమ్మెల్యే బేతి సుభాష్రెడ్డిని కలిసి సమస్యలను వివరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నియోజకవర్గ పరిధిలోని పలు ప్రాంతాల్లో నెలకొన్న సమస్యలను దశల వారీగా పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. వెంకటరెడ్డినగర్లో పార్కు సంరక్షణకు చర్యలు తీసుకోవడంతో పాటు రోడ్డు నిర్మాణం పనులు చేపట్టనున్నామన్నారు. అనంతరం కాలనీ సంక్షేమ సంఘం నాయకులు ఎమ్మెల్యే బేతి సుభాష్రెడ్డిని సన్మానించారు. కార్యక్రమంలో కాలనీ సంక్షేమ సంఘం అధ్యక్ష, కార్యదర్శులు రాగిరి నర్సింహ, మురళీధర్గౌడ్, కార్యనిర్వహక అధ్యక్షుడు సాయికుమార్, కాలనీవాసులు శివారెడ్డి, వంశీధర్రెడ్డి, శ్రీనివాస్, పెంటేశ్, కృష్ణ, సురేశ్, టీఆర్ఎస్ నాయకులు ఎంపెల్లి పద్మారెడ్డి, డప్పు గిరిబాబు, తూర్పాటి హనుమంతు, రెడ్డినాయక్, సత్యనారాయణ పాల్గొన్నారు.