శామీర్పేట, జూన్ 7: కరోనాను కట్టడి చేస్తూ ప్రాణాపాయం నుంచి కాపాడుకోవడానికి ప్రతిఒక్కరూ కొవిడ్ టీకాలు తప్పనిసరిగా వేయించుకోవాలని నల్సార్ లా యూనివర్సిటీ వైస్ ఛాన్స్లర్ ఫైజన్ముస్తఫా సూచించా రు.శామీర్పేటలోని నల్సార్లో సోమవారం మల్లారెడ్డి ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ ఆధ్వర్యంలో కొవిడ్ టీకా కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. లా యూనివర్సిటీలోని విద్యార్థినీవిద్యార్థులు, అధ్యాపకులు, పనిచేసే సిబ్బంది తప్పనిసరిగా టీకాలు వేసుకోవాలని సూచించారు. సెక్యూరిటీ, కూలీలతో పాటు వారి కుటుంబసభ్యులకు టీకాలు ఇచ్చే విధం గా చర్యలు చేపడుతున్నట్లు వివరించారు. రోజుకు సుమా రు 250 నుంచి 300ల వరకు టీకాలు వేయడం జరుగుతుందన్నారు. కార్యక్రమం లో నల్సార్ రిజిస్టర్ ప్రొఫెసర్ బాలకృష్టారెడ్డి, డాక్టర్ ఎల్ఈజే చంద్రశేఖర్, విద్యాలయఅధ్యాపకులు,విద్యార్థులు, సిబ్బంది ఉన్నారు.
జవహర్నగర్ ప్రభుత్వ పాఠశాలలో ఏర్పాటు చేసిన టీకా సెంటర్ల ద్వారా సోమవారం 490 మందికి, తూం కుంట లో 97 మందికి టీకాలు వేయగా.. టీకా కేంద్రాన్ని అదనపు కలెక్టర్ జాన్ శ్యాంసన్ పరిశీలించారు.
మేడ్చల్ కలెక్టరేట్, జూన్ 7 : నిత్యసేవకులందరూ టీకా వేయించుకోవాలని నాగారం మున్సిపల్ చైర్మన్ కౌకుట్ల చంద్రారెడ్డి కోరారు. మున్సిపల్ కేంద్రంలో ఏర్పాటు చేసిన కొవిడ్ వ్యాక్సినేషన్ కేంద్రాన్ని చైర్మన్ సోమవారం సందర్శించారు. ఈ సందర్భంగా టీకా వేయించుకున్న నిత్యసేవకులకు చైర్మన్ అరటిపండ్లు అందజేశారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ ఏ.వాణిరెడ్డి, ఆర్వో వెంకటేశ్వర్లు, వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
మేడ్చల్ రూరల్: గుండ్లపోచంపల్లి మున్సిపాలిటీ పరిధిలో 215 మంది నిత్యసేవకులు స్లాట్ బుక్ చేసుకోగా 204 మంది వ్యాక్సిన్ వేయించుకున్నారు. టీకా నిర్వహిస్తున్న తీరును చైర్పర్సన్ మద్దుల లక్ష్మీశ్రీనివాస్ రెడ్డి పర్యవేక్షించి, ఇబ్బందులు లేకుండా సౌకర్యాలు కల్పించాలని సూచించారు. కార్యక్రమంలో కౌన్సిలర్లు జైపాల్రెడ్డి, బాలరాజు, మాజీ సర్పంచ్ శ్రీనివాస్ రెడ్డి, ఆర్వో శ్రీనివాస్గౌడ్, టీఆర్ఎస్ మున్సిపాలిటీ అధ్యక్షుడు మండల సంజీవగౌడ్ తదితరులు పాల్గొన్నారు.