కొల్చారం, జనవరి 17 : రంగంపేట అభివృద్ధికి తనవంతు శాయశక్తులా కృషి చేస్తానని ఎమ్మెల్యే మదన్రెడ్డి అన్నారు. మండల పరిధిలోని రంగంపేటలో మంగళవారం పలు అభివృద్ధి పనులకు స్థానిక సర్పంచ్ బండి సుజాత, జడ్పీటీసీ మేఘమాల, ఎంపీపీ మంజులతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ నిధులతో చేపట్టిన సీసీ రోడ్లు, మురుగు కాల్వలు పనులకు కొబ్బరికాయ కొట్టి ప్రారంభించారు. జాతీయ ఉపాధి నిధులతో నిర్మించిన తెలంగాణ క్రీడా ప్రాంగణాన్ని ప్రారంభించారు. మిషన్ భగీరథ నిధుల తో నిర్మించిన వాటర్ట్యాంకును ప్రారంభించారు. రూ. 5లక్షలతో నిర్మించనున్న కబరస్తాన్ ప్రహరీ పనులకు భూమిపూజ చేశారు. ముస్లిం సోదరులకు కమ్యూనిటీహాల్, షాపింగ్ కాంప్లెక్స్ అడుగుతున్నారని వారి కోరిక మేరకు నిధులు మంజూరుకు కృషి చేస్తానన్నారు. రం గంపేట పెద్ద గ్రామమైనందున ఇంకా ఎన్నో పనులు చేయాల్సి ఉందని వాటికి కృషి చేస్తానని తెలిపారు.
కార్యక్రమంలో జిల్లా పరిషత్ కో-ఆప్షన్ సభ్యులు మన్సూ ర్ అహ్మద్, ఎలక్షన్రెడ్డి, పంచాయతీరాజ్ డీఈ అమరేశ్వర్, ఏఈ ఇర్ఫాన్హుస్సేన్, మండల బీఆర్ఎస్ అధ్యక్షుడు గౌరిశంకర్ గుప్తా, మెదక్ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ సావిత్రిరెడ్డి, డైరెక్టర్ పైతర చంద్రశేఖర్రెడ్డి, ఉపసర్పంచ్ మచ్చ శ్రీనివాస్, కిష్టాపూర్ సర్పంచ్ గోదావరి, బీఆర్ఎస్ యువత అధ్యక్షుడు కోనాపూర్ సంతోశ్రావు, బీఆర్ఎస్ గ్రామ అధ్యక్షుడు తలారి దుర్గేశ్, సాయాగౌడ్, సత్యాగౌడ్, రవీందర్గౌడ్, నాగరాజు, మైనార్టీ నాయకులు గౌస్పాష, మహబూబ్, ముజీబ్ పాల్గొన్నారు.