నర్సాపూర్, ఫిబ్రవరి 8 : నర్సాపూర్ మున్సిపల్ పరిధిలోని పలు అభివృద్ధి పనులను వేగవంతం చేస్తామని ఎమ్మెల్యే మదన్రెడ్డి పేర్కొన్నారు. మంగళవారం నర్సాపూర్ మున్సిపల్ కార్యాలయంలో చైర్మన్ మురళీయాదవ్ ఆధ్వర్యంలో నిర్వహించిన సాధారణ సర్వసభ్య సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా సమావేశంలో పలు అభివృద్ధి కార్యక్రమాలపై చర్చించి తీర్మానించారు. నర్సాపూర్ మున్సిపాలిటీకి స్వాగత తోరణంకు దాతల సహకారం తీసుకొని నిర్మాణం చేపడుతామని తీర్మానించారు. ప్రతీ వార్డుకి 300 చొప్పున రెడ్బిన్లను పంపిణీ చేయాలని తీర్మానించారు. ఎమ్మెల్యే మదన్రెడ్డి మాట్లాడుతూ పారిశుధ్య కార్మికులకు 30 శాతం వేతనాలు పెరిగాయని పే ర్కొన్నారు. మున్సిపల్ కార్యాలయాన్ని ఐబీ ఆవరణలో నిర్మించడానికి తీర్మానించారని తెలియజేశారు. ఇండోర్ స్టేడియంను పాత మున్సిపాల్ కార్యాలయం వద్ద ఏర్పాటు చేయనున్నట్టు వెల్లడించారు. కార్యక్రమంలో లేబర్ వెల్ఫేర్ బోర్డు చైర్మన్ దేవేందర్రెడ్డి, మున్సిపల్ కమిషనర్ చాముండేశ్వరి, వైస్ చైర్మన్ నయీమొద్దీన్, కౌన్సిలర్లు అశోక్గౌడ్తో పాటు ఇతర కౌన్సిలర్లు, మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు.