అందోల్, అక్టోబర్ 16: ఎమ్మెల్యేగా మరోసారి అవకాశం ఇవ్వాలని, నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి చేస్తానని అందోల్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి చంటి క్రాంతికిరణ్ అన్నారు. సోమవారం అందోల్లో పార్టీ నూతన కార్యాలయం ప్రారంభించారు. ఎంపీ బీబీపాటిల్, జడ్పీ చైర్పర్సన్ మంజుశ్రీజైపాల్రెడ్డి, స్టేట్ కార్పొరేషన్ చైర్మన్ భిక్షపతి, మాజీ ఎమ్మెల్సీ, నియోజకవర్గ ఎన్నికల ఇన్చార్జ్ ఫరూఖ్హుస్సేన్తో కలిసి జోగిపేటలో పార్టీ జెండా ఆవిష్కరించారు. అనంతరం జోగిపేటలోని ఓ ప్రైవేట్ ఫంక్షన్హాల్లో నియోజకవర్గంలోని పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజాప్రతినిధులతో విస్తృతస్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ 2018లో సీఎం కేసీఆర్ తనకు మొదటిసారి అవకాశం ఇవ్వడంతో స్థానిక బిడ్డగా ప్రజలు, నాయకులు ఆదరించి భారీ మెజార్టీతో గెలిపించారన్నారు. నియోజకవర్గంలోని అన్ని గ్రామా ల్లో ఎన్నో అభివృద్ధి పనులు చేసి, ప్రజలకు కావాల్సిన మౌలిక వసతులు కల్పించానన్నారు. దీన్ని గుర్తించి సీఎం కేసీఆర్ తనకు రెండోసారి అవకాశం ఇచ్చారని, ఈసారి కూడా పార్టీ శ్రేణులు కష్టపడి పనిచేసి భారీ మెజార్టీ కట్టబెట్టాలన్నారు.
కాంగ్రెస్-బీజేపీలకు అందోల్లో కాలం చెల్లిందని వారి మాటలు నమ్మె స్థితిలో ప్రజలు లేరని ఎమ్మెల్యే అన్నా రు. వారికి దమ్ముంటే ఇక్కడ ప్రకటించిన ఆరు గ్యారెంటీలు వారు అధికారంలో ఉన్న రాష్ర్టాల్లో అమలు చేయాలని సవాల్ విసిరారు. దామోదర్ ఎన్నికల్లో ఓడి తే నియోజకవర్గంలో కనిపించడని, ఎన్నికలప్పుడు మాత్రమే ఆయనకు నియోజకవర్గం గుర్తుకు వస్తుందని, ఇలాంటి నాయకులు మనకు అవసరమా అని ప్రశ్నించారు. 2023 ఎన్నికల మ్యానిఫెస్టో అన్ని వర్గాలకు ఎంతో ఉపయోగకరంగా ఉన్నదన్నారు. ఎంపీ బీబీ పాటిల్ మాట్లాడుతూ దేశం గర్వించే రీతిలో తెలంగాణ అభివృద్ధి చెందుతుందని, మరోసారి కేసీఆర్ను సీఎం చేయాలన్నారు. జడ్పీ చైర్ పర్సన్ మంజుశ్రీజైపాల్రెడ్డి మాట్లాడుతూ మన స్థానిక ముద్దుబిడ్డ క్రాంతి కిరణ్ను ఎమ్మెల్యేగా ఆశీర్వదించాలన్నారు. స్టేట్ ట్రేడ్ ప్రమోషన్ కార్పొరేషన్ చైర్మన్ భిక్షపతి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిన ఆరు గ్యారెంటీలు ఆరు అబద్దాలేనని, ఆ పథకాలకు గ్యారెంటీ, వారెంటీ లేదని విమర్శించారు. ఆ పార్టీ పథకాలను ప్రజలు నమ్మే పరిస్థితిలేదన్నారు. ముచ్చటగా మూడోసారి రాష్ట్రంలో గెలిచేది బీఆర్ఎస్సేనని, సీఎం అయ్యేది కేసీఆర్ సారేనని ధీమా వ్యక్తం చేశారు.
మాజీ ఎమ్మెల్సీ, నియోజకవర్గం ఎన్నికల ఇన్చార్జి ఫరూఖ్ హుస్సేన్ మాట్లాడుతూ కాంగ్రెస్కు రాష్ట్రంలో కాలం చెల్లిందన్నారు. తాను కాంగ్రెస్లో కొన్ని దశాబ్దాలపాటు పని చేశానని, అందులో రాష్ర్టాన్ని ముందుకు తీసుకువెళ్లే ఒక్క నాయకుడు లేడని అన్నారు. ఆ పార్టీలో అందరూ సీఎం అభ్యర్థులేనని ఎద్దేవా చేశారు. ఎవరు ఎన్ని హామీలిచ్చినా, ఉచితాలు ప్రకటించినా సీఎం కేసీఆర్ను ఎదుర్కొలేరని, అంత దమ్ము లేదని రాష్ట్రంలో ఈసారి గెలిచి, నిలిచేది బీఆర్ఎస్ మాత్రమే అన్నారు. సౌమ్యుడు, మంచి మనిషి అందరికీ ఎప్పు డూ అందుబాటులో ఉండే క్రాంతికిరణ్కు భారీ మెజార్టీతో గెలిపించాలన్నారు. అనంతరం భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించారు. కార్యక్రమంలో మార్క్ ఫెడ్ డెరెక్టర్ జగన్మోహన్రెడ్డి, రాష్ట్ర నాయకులు జైపాల్రెడ్డి, రాహుల్ కిరణ్, మున్సిపల్ చైర్మన్ మల్లయ్య, ఏఎంసీ చైర్మన్లు పల్లె సంజీవయ్య, విజయలక్ష్మి, మాజీ చైర్మన్లు రజినీకాంత్, మల్లికార్జున్, ఎంపీపీ బాలయ్య, మాజీ ఎంపీపీ రామాగౌడ్, పార్టీ అధ్యక్షుడు లక్ష్మీకాంత్రెడ్డి, పట్టణ అధ్యక్షుడు శ్రీధర్, సర్పంచులు లింగాగౌడ్, ప్రవీణ్రెడ్డి, అనిల్రెడ్డి పాల్గొన్నారు.