గుమ్మడిదల, మార్చి17: మండలంలోని వీరన్నగూడెం- బొంతపల్లి భధ్రకాళీ సమేత వీరభద్రస్వామి కల్యాణోత్సవాన్ని శుక్రవారం అంగరంగ వైభవంగా నిర్వహించారు. భద్రకాళీ సమేత వీరభద్రస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా స్వామికి, అమ్మవారికి పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి పట్టువస్ర్తాలు సమర్పించారు. అంతకుముందు ఈవో శశిధర్గుప్తా ధర్మదాయశాఖ అధికారులు, ఆలయవతనుధారులు, అర్చకులు పూర్ణకుంభంతో ఎమ్మెల్యేకు స్వాగతం పలికారు. పురోహితులు భద్రకాళీ అమ్మవారిని, స్వామివారి తరఫున ఎదుర్కోలు నిర్వహించారు. ఇందులో ఎమ్మెల్యే సతీమణి యాదమ్మ, నియోజకవర్గ ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. అనంతరం కల్యాణ వేదికపై అంగరంగ వైభవంగా లోక కల్యాణార్థం కల్యాణోత్సవాన్ని జరిపించారు. కల్యాణోత్సవంలో వందలాది మంది భక్తులు పాల్గొన్నారు.
బ్రహ్మోత్సవాల్లో భాగంగా శుక్రవారం వేకువజామున ఆలయ కార్యనిర్వాహణ అధికారి శశిధర్గుప్తా, సీనియర్, జూనియర్ అసిస్టెంట్లు రవీంద్రమూర్తి, సోమయ్య, ఆలయ వతనులదారులు ఆలేటి జగన్మోహన్రెడ్డి, గటాటిరవి, వెంకట్రెడ్డి, రాహుల్రెడ్డి, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు మడపతి గణేశ్ ఆధ్వర్యంలో అర్చకులు అగ్నిగుండాలకు ప్రత్యేక పూజలు చేశారు. వరుణదేవుడి ఆగమనంతో భక్తులు అగ్నిగుండల్లో నడిచి మొక్కులు తీర్చుకున్నారు. అనంతరం స్వామివారిని, అమ్మవారిని దర్శించుకున్నారు.
బ్రహ్మోత్సవాల్లో భాగంగా శుక్రవారం నిర్వహించిన కల్యాణోత్సవం అనంతరం బొంతపల్లి వర్తకసంఘం అధ్యక్షుడు ఉప్పునూతుల బాలరాజ్గౌడ్, వర్తక సం ఘం సభ్యుల ఆధ్వర్యంలో భక్తులకు అన్నప్రసాద వితరణ చేశారు. సర్పంచ్లు పొన్నబోయిన మమత, ఆలేటి నవీనా శ్రీనివాస్రెడ్డి, మాజీ చైర్మన్లు గటాటి భద్రప్ప, ఆలేటి శ్రీనివాస్రెడ్డి, సద్ది విజయభాస్కర్ రెడ్డి, సురభి నాగేందర్గౌడ్, ఎంపీపీ సద్ది ప్రవీణారెడ్డి, జడ్పీటీసీ కుమార్గౌడ్, బీఆర్ఎస్ నాయకులు గోవర్ధన్రెడ్డి, చక్రపాణి, గ్యారల మల్లేశ్, వినోద్గౌడ్, ముద్దంగల గోపాల్, హరికృష్ణ, సుంకరి శంకర్, గౌరీ శంకర్గౌడ్, తుపాకుల రాజశేఖర్గౌడ్, సర్పంచ్లు రాజశేఖర్, నర్సింహరెడ్డి, హన్మంత్రెడ్డి పాల్గొన్నారు.