రామాయంపేట, సెప్టెంబర్ 20 : తెలంగాణ వజ్రోత్సవాల సందర్భంగా డీసీసీబీ బ్యాంకు కొత్త పథకాన్ని రూపొందించిందని రామాయంపేట డీసీసీబీ బ్యాంకు మేనేజర్ ప్రణీత్కుమార్ పేర్కొన్నారు. ఖాతాదారులకు డిపాజిట్ చేసిన నగదుపై 333రోజులకు 7శాతం వడ్డీ ఇస్తుందన్నారు. వడ్డీ శాతం పెంపును డిపాజిట్ దారులు సద్వినియో గం చేసుకోవాలని సూచించారు.
సుతారిపల్లి గ్రామంలో పంచాయతీ కార్యాలయంలో మంగళవారం సర్పంచ్ సంధ్య, కార్యదర్శి పద్మ సమక్షంలో గ్రామస్తులతో సమావేశం ఏర్పాటు చేశారు. ఖాతాదారుల కు డీసీసీబీ కొత్త పథకాన్ని అమలు చేస్తుందన్నారు. నగదు డిపాజిట్ల పై వడ్డీ శాతాన్ని పెంచినట్లు పేర్కొన్నారు. సాధారణ ఖాతాదారులకు 333 రోజులకు 7శాతం, సీనియర్ సిటిజన్కు 7.5శాతం వడ్డీ ఇస్తు న్నట్లు తెలిపారు. సిటిజన్లు తమ నగదును సహకార బ్యాంకుల్లో డిపాజిట్ చేసుకోవాలన్నారు. ఇతర రుణాలను సైతం తక్కువ వడ్డీకే ఇస్తు న్నామన్నారు. సమావేశంలో బ్యాంకు సిబ్బంది ఉమామహేశ్వర్, ఫీల్డ్ ఆఫీసర్ మహేందర్, సీఏ రజిత, సీఈవో నర్సింహులు ఉన్నారు.