గజ్వేల్ అర్బన్, జనవరి 28: త్వరలో జరుగనున్న జాతీయ జూనియర్ కబడ్డీ బాలబాలికల జట్లకు సిద్దిపేట జిల్లా క్రీడాకారులు ఎంపికైనట్లు జిల్లా కబడ్డీ అసోసియేషన్ అధ్యక్షుడు ఎన్సీ సంతో ష్ తెలిపారు. ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఇటీవల గజ్వేల్లో నిర్వహించిన రాష్ట్రస్థాయి జూనియర్ కబడ్డీ పోటీల్లో ప్రతిభ కనబర్చిన క్రీడాకారులను జాతీయస్థాయి పోటీల్లో రాష్ట్రం తరపున ఎంపిక చేసినట్లు పేర్కొన్నారు. త్వరలో జరుగనున్న జాతీయ జూనియర్ కబడ్డీ బాలబాలికల జట్లకు సిద్దిపేట జిల్లా క్రీడాకారులు ఎంపికైనట్లు జిల్లా కబడ్డీ అసోసియేషన్ అధ్యక్షుడు ఎన్సీ సంతో ష్ తెలిపారు. ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఇటీవల గజ్వేల్లో నిర్వహించిన రాష్ట్రస్థాయి జూనియర్ కబడ్డీ పోటీల్లో ప్రతిభ కనబర్చిన క్రీడాకారులను జాతీయస్థాయి పోటీ ల్లో రాష్ట్రం తరపున ఎంపిక చేసినట్లు పేర్కొన్నారు. బాలికల విభాగంలో సిద్దిపేట జిల్లాకు చెందిన మాధవి (రైట్కవర్), బాలుర విభాగంలో లారెన్( రైడర్) ఎంపికయ్యారన్నారు. జిల్లా కబడ్డీ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి కుంటనోళ్ల శివకుమార్ను రాష్ట్ర జట్లకు మేనేజర్గా నియమించినట్లు తెలిపారు.
జిల్లాకు ఇంతటి గౌరవం దక్కినందుకు క్రీడాకారుల ను ప్రధాన కార్యదర్శి కుంటనోళ్ల శివకుమార్ను అభినందించారు. ఇందుకు సహకరించిన రాష్ట్ర అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్, ప్రధాన కార్యదర్శి జగదీశ్వర్యాదవ్లకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. కాగా, ఎంపికైన క్రీడాకారులు హైదరాబాద్ బాచుపల్లిలో ఫిబ్రవరి 1వ తేదీ నుంచి 4వ తేదీ వరకు జరుగనున్న జాతీయస్థాయి క్రీడల్లో పాల్గొంటారని వివరించారు. ఎంపిక పట్ల జిల్లా కబడ్డీ అసోసియేషన్ చైర్మన్, ఎఫ్డీసీ మాజీ చైర్మన్ వంటేరు ప్రతాప్రెడ్డి, వైస్ చైర్మన్ జుబేర్పాషా, మహిళా కమిషన్ చైర్పర్సన్ రాజ్యలక్ష్మి, జిల్లా కోశాధికారి సత్యం, ఉపాధ్యక్షులు రాజు, రమేశ్, ప్రేమ్ నారాయణ, రంగనాథ్, సంయుక్త కార్యదర్శులు మహేశ్, శ్రీకాంత్, నరేంద్రబాబు, కరుణాకర్, కార్యవర్గ సభ్యులు హర్షం వ్యక్తం చేశారు.