గుమ్మడిదల, మార్చి16: సంగారెడ్డి జిల్లాలోని సుప్రసిద్ధ శైవ క్షేత్రమైన బొంతపల్లి భద్రకాళీ సమేత వీరభద్రస్వామి బ్రహ్మోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. గురువారం రాత్రి బొంతపల్లి వీరభద్రస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా భద్రకాళీ సమేత వీరభద్రస్వామి బృంగీశ్వర వాహనంలో ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు. అగ్నిగుండాల్లో నడుస్తూ భక్తులు మొక్కులు తీర్చుకున్నారు. దండకాలు, ప్రత్యేక పూజలకు భక్తులు వందలాదిగా తరలివచ్చారు. ఆలయ కార్యనిర్వాహకుడు శశిధర్గుప్తా, జూనియర్ అసిస్టెంట్ సోమయ్య, వతనుదారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.
నేడు భద్రకాళీ సమేత వీరభద్రస్వామి కల్యాణోత్సవం
బ్రహ్మోత్సవాల్లో భాగంగా భద్రకాళీ సమేత వీరభద్రస్వామి కల్యాణోత్సవాన్ని శుక్రవారం నిర్వహించనున్నారు. ఈ ఉత్సవానికి ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు నీలం మధు ముదిరాజ్, పలు పార్టీల నాయకులు హాజరుకానున్నారు. స్వామి వారి కల్యాణానికి చలువపందిళ్లు ఏర్పాటు చేస్తున్నారు. కల్యాణోత్సవం అనంతరం బొంతపల్లి వర్తక సంఘం అధ్యక్షుడు ఉప్పనూతల బాలరాజ్గౌడ్ ఆధ్వ ర్యంలో అన్నదానం చేయనున్నట్లు ఉత్సవాల నిర్వాహకులు తెలిపారు.