మనోహరాబాద్, అక్టోబర్ 24 : అనుమతులు లేకుండా అక్రమంగా మట్టిని తరలిస్తున్న టిప్పర్ను మనోహరాబాద్ పోలీసులు పట్టుకున్నారు. ఇందుకు సంబంధించి ఎస్ఐ రాజుగౌడ్ తెలిపిన వివరాల ప్రకారం..మనోహరాబాద్ మండల కేంద్రంలో పోలీసులు తనిఖీలు చేపట్టారు.
టిప్పర్ లారీ డ్రైవర్ వెంకటేశ్ను అనుమతి పత్రాలు చూపాలని కోరడంతో లేవని తెలిపాడు. దీంతో నిబంధనలకు విరుద్ధంగా ఎలాంటి పత్రాలు లేకుండా అక్రమంగా మట్టిని తరలిస్తుండంతో మట్టిలోడు ఉన్న టిప్పర్ను మనోహరాబాద్ పోలీస్స్టేషన్కు తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ రాజుగౌడ్ తెలిపారు.