కంది, డిసెంబర్ 8 : సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ శుక్రవారం కందిలోని రుక్మిణీ పాండురంగస్వామిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. ఎమ్మెల్యేగా గెలుపొందిన చింతా ప్రభాకర్కు బీఆర్ఎస్ నాయకులు ఘన స్వాగతం పలికారు. బీఆర్ఎస్ నాయకులు మధుసూదన్రావు (పంతులు) ఆధ్వర్యంలో వేద పండితుల సమక్షంలో ప్రత్యేక పూజ లు చేశారు. అనంతరం జడ్పీటీసీ కొండల్రెడ్డి, నాయకులు ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ను సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా చింతా ప్రభాకర్ మాట్లాడుతూ తన గెలుపునకు కృషి చేసిన పార్టీ నాయకులు, కార్యకర్తలు, కంది మండల ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి రాలేదని ఆధైర్యపడొద్దన్నారు. ఈ విజయం తనకు మరింత బాధ్యత పెంచిందని, సంగారెడ్డి నియోజకవర్గ అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానన్నారు. ప్రతి కార్యకర్తను కాపాడుకుంటూ అండగా ఉంటానన్నారు. కార్యక్రమంలో ఎంపీటీసీ నందకిషోర్, నాయకులు రవి, మోహన్రెడ్డి, జంగయ్య పాల్గొన్నారు.
సదాశివపేట, డిసెంబర్ 8 : ఎమ్మెల్యే చింతా ప్రభాకర్కు పొట్టిపల్లి గ్రామస్తులు అభినందనలు తెలిపారు. శుక్రవారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో చింతా ప్రభాకర్ను కలిసి శాలువాతో సన్మానించారు. ఈ సందర్భంగా చింతా ప్రభాకర్ మాట్లాడుతూ ఎల్లప్పుడు అందుబాటులో ఉండి గ్రామాభివృద్ధికి తనవంతు కృషి చేస్తానన్నారు. కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ అశోక్, బీఆర్ఎస్ గ్రామ అధ్యక్షుడు మహేంద్రనాథ్, గ్రామ పంచాయతీ కో-ఆప్షన్ సభ్యుడు ఉదయ్భాస్కర్, నాయకులు ప్రకాశ్, బుచ్చిరాములు, భాస్కర్, శ్రీనివాస్, రవికుమార్, ఏసయ్య, సంతోశ్కుమార్, నగేశ్, భిక్షపతి, శేఖర్, రాజు, మాణయ్య, మల్లేశం, పాపయ్య, అనంతరాంగౌడ్, విజయ్కుమార్, సంగమేశ్వర్, కురుమ సంఘం అధ్యక్షుడు నర్సింహులు, పెంటయ్య, రాజేందర్, సంపత్, ప్రభాకర్, శివయ్య, దుర్గప్రసాద్, రాజు పాల్గొన్నారు.