న్యాల్కల్, జనవరి 11 : సంగారెడ్డి జిల్లా న్యాల్కల్ మండలం గణేశ్పూర్ గ్రామ శివారులోని తెలంగాణ-కర్ణాటక సరిహద్దులో వాహన తనిఖీలో పాటు థర్మల్ స్క్రీనింగ్, కొవిడ్ పరీక్షలు ముమ్మరంగా చేపడుతున్నారు. మహారాష్ట్ర, కర్ణాటక రాష్ర్టాల గుండా తెలంగాణలోకి రాకపోకలు సాగించే ప్రతి వాహనాన్ని రెవెన్యూ, పోలీసుల సహాయంతో నిలిపి వైద్య సిబ్బంది పరీక్షలు నిర్వహిస్తున్నారు. కరోనా కట్టడే లక్ష్యంగా వాహనాల్లో ప్రయాణించే వారికి టెంపరేచర్ పరీక్షించి, కొవిడ్ లక్షణాలేమి లేవని నిర్ధారించుకున్న తర్వాతనే తెలంగాణలోకి అనుమతిస్తున్నారు. ఏమాత్రం అనుమానం ఉన్న ర్యాపిడ్ యాంటిజెన్ పరీక్షలు చేస్తున్నారు. తహసీల్దార్ రాధాబాయి, మిర్జాపూర్(బి) ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి ప్రశాంతి, హద్నూర్ ఎస్సై వినయ్కుమార్ ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు.