మనోహరాబాద్, ఏప్రిల్ 04 : చెరువులో పడి ఓ మహిళ గల్లంతైన సంఘటన మనోహరాబాద్ పోలీస్స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఇందుకు సంబంధించి ఎస్ఐ రాజుగౌడ్ తెలిపిన వివరాల ప్రకారం.మనోహరాబాద్ మండలం కూచారం గ్రామానికి చెందిన కర్రె యాదమ్మ గ్రామ చెరువులో ప్రమాదవశాత్తు పడిపోయింది. విషయం తెలుసుకున్న ఎస్ఐ రాజుగౌడ్ ఘటన స్థలానికి వెళ్లి గజ ఈతగాళ్లతో మహిళ కోసం గాలింపు చర్యలు చేపట్టారు. వేసవి కావడంతో చెరువులు, కుంటల వద్ద ఈతకు వెళ్లే వారు పలు జాగ్రత్తలు పాటించాలన్నారు. చిన్నపిల్లలను, యువకులను చెరువుల వద్దకు వెళ్లకుండా వారి తల్లిదండ్రులు జాగ్రత్తలు పాటించాలన్నారు.