మెదక్ : చాకలి ఐలమ్మ ఉద్యమ స్ఫూర్తిని ఆదర్శంగా తీసుకోవాలని మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి అన్నారు. సోమవారం వీరవనిత ఐలమ్మ జయంతి వేడుకలను మెదక్ పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే చాకలి ఐలమ్మ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. భూమి కొసం, భుక్తి కోసం బానిస బతుకు విముక్తి కోసం రజకారులను, భూస్వాములును ఎదురించిన తెలంగాణ వీరవనిత చాకలి ఐలమ్మ అని కొనియాడారు.
తొలి భూ పోరాటానికి సామాజిక న్యాయానికి నాంది పలికిన ధైర్య శాలి ఐలమ్మ అని అన్నారు. ఎన్నో ఉద్యమాల్లో చురుకుగా పాల్గొన్న ఐలమ్మ వీరత్వాన్ని ప్రతి ఒక్కరూ ఉద్యమ స్ఫూర్తిగా తీసుకొని ఆమె అడుగుజాడల్లో నడవాలన్నారు.
కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ చంద్రపాల్, టీఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యడు యం.గంగాధర్, మున్సిపల్ కౌన్సిలర్లు జయరాజ్ ఆర్ కె శ్రీనివాస్,హవేళిఘనాపూర్ మండల పార్టీ అధ్యక్షుడు సిహెచ్.శ్రీనివాస్ రెడ్డి, మెదక్ జిల్లా రజక సంఘం అధ్యక్షులు సాంగు స్వామి, మెదక్ జిల్లా బీసీ సంఘం అధ్యక్షులు మెట్టు గంగారం పాల్గొన్నారు.