మహా శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని జిల్లాలోని శైవక్షేత్రాలు కిటకిటలాడాయి. శుక్రవారం ఆలయాలకు ఉదయం నుంచే భక్తులు బారులుదీరారు. ఆలయ ప్రాంగణాలన్నీ శివనామస్మరణతో మారుమోగాయి. నందికంది గ్రామంలోని పురాతన రామలింగేశ్వర ఆలయం, కొల్కూర్లోని సదాశివదేవాలయానికి భక్తులు చేరుకొని శివలింగానికి అభిషేకం, ప్రత్యేక పూజలు చేశారు. జహీరాబాద్లోని పలు శివాలయాల్లో ఎమ్మెల్యే మాణిక్రావు, మాజీ మంత్రి చంద్రశేఖర్ ప్రత్యేక పూజలు చేశారు. మహా పర్వదినం పురస్కరించుకొ పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి దంపతులు పట్టణంలోని పలు శివాలయాల్లో ప్రత్యేక పూజలు చేశారు.