మెదక్ : తాగుడుకు బానిసై మనస్తాపానికి గురై ఓ వ్యక్తి త్మహత్యకు పాల్పడిన సంఘటన తూప్రాన్ పట్టణంలోని బ్రాహ్మణ వీధిలో బుధవారం తెల్లవారుజామున చోటు చేసుకుంది. తూప్రాన్ పోలీసుల కధనం ప్రకారం పట్టణానికే చెందిన సాహూజి లోకేష్(35) గత కొంత కాలంగా మద్యం తాగుతూ ఉండేవాడని పోలీసులు తెలిపారు.
తాగుడుకు బానిస కావడంతో మృతుడి భార్య కూడా గతంలోనే ఇంట్లో నుంచి వెళ్లిపోయిందని తెలిపారు. పట్టణంలోని అద్దెకు ఉన్న ఇంట్లోనే ఫ్యానుకు తాడుతో ఉరివేసున్నట్లు తెలిపారు.
తెల్లవారినా ఎంతకూ తలుపు తీయక పోవడంతో ఇంటి ఓనర్ మృతుడి సోదరులకు ఫోన్ద్వారా సమాచారం చేరవేశాడు.
మృతుడి సోదరుడు సాహూజీ ఆదర్శ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని పంచనామా నిర్వహించి పోస్టుమార్టన్ నిమిత్తం తూప్రాన్ ప్రభుత్వ దవాఖానకు మృతదేహాన్ని తరలించినట్లు పోలీసులు తెలిపారు.