పల్స్ పోలియోకు ఏర్పాటు పూర్తి
జిల్లాలో 73450 మంది చిన్నారులకు పోలియో చుక్కలు
జిల్లాలో 523 పల్స్ పోలియో బూత్ల ఏర్పాటు
53 రూట్లు, 53 మంది సూపర్వైజర్లు ఏర్పాటు
మెదక్/మెదక్ అర్బన్, ఫిబ్రవరి 25: జిల్లాలో పల్స్ పోలియో కార్యక్రమానికి వైద్య, ఆరోగ్య శాఖ అన్ని ఏర్పాట్లు చేసింది. ఈ నెల 27 నుంచి మూడు రోజుల పాటు ఈ కార్యక్రమం చేపడుతారు. మెదక్ జిల్లాలోని 21 మండలాల్లో అర్హులైన చిన్నారులందరికీ చుక్కల మందు వేసేందుకు సర్వం సిద్ధం చేశారు. వంద శాతం లక్ష్యాన్ని చేరుకునేందుకు ఆశ కార్యకర్తలతో పాటు ఆయా శాఖల సమన్వయంతో చర్యలు చేపడుతున్నారు. జిల్లాలోని రద్దీ ప్రాంతాల్లో ప్రత్యేక కేంద్రాలు ఏర్పాటు చేయనున్నారు. మొదటి రోజు కేంద్రాల్లో, రెండు, మూడు రోజు ఇంటింటికీ వెళ్లి చుక్కల మందు వేసేలా ఏర్పాట్లుచేశారు.
జిల్లాలో 73,450 మంది చిన్నారులు
మెదక్ జిల్లాలో 21 మండలాలు, నాలుగు మున్సిపాలిటీలు, 19 పీహెచ్సీలు ఉన్నాయి. 0-5 ఏండ్లలోపు చిన్నారులు 73,450 మంది ఉన్నారు. 19 పీహెచ్సీల్లో 53 మంది సూపర్వైజర్లు, 20 మొబైల్ టీంలు, 20 ట్రాన్సిట్ పాయింట్లను ఏర్పాటు చేయనున్నారు. ఇటుక బట్టీలు, క్వారీలు, వలస, భవన నిర్మాణ కార్మికుల పిల్లలు ఉండే సమస్యాత్మక ప్రాంతాలు గుర్తించారు. టాస్క్ఫోర్స్ పర్యవేక్షణ బృందాలు పక్కాగా పర్యవేక్షణ చేయనున్నాయి.
విస్తృతంగా ప్రచారం..
పల్స్ పోలియోపై అవగాహన కల్పించేందుకు అధికారులు విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. వైద్యారోగ్య శాఖ అధికారులు, సిబ్బంది, అంగన్వాడీ టీచర్లు, ఆయాలు, ఆశా వర్కర్లు పాల్గొంటున్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్యేలు, మున్సిపల్ చైర్మన్లు, కౌన్సిలర్లు, సర్పంచ్లు, ఎంపీటీసీలు, ఎంపీపీలు, జడ్పీటీసీలను భాగస్వాముల్ని చేసి, విజయవంతం చేయాలని భావిస్తున్నారు.
చిన్నారులకు చుక్కల మందు వేయించాలి
ప్రతి చిన్నారికీ పోలియో చుక్కలు వేయడమే లక్ష్యమని జిల్లా వైద్యాధికారి వెంకటేశ్వర్లు అన్నారు. శుక్రవారం పల్స్ పోలియో కార్యక్రమంపై వైద్యాధికారి కార్యాలయంలో విలేకరుల సమాశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ నెల 27న పల్స్ పోలియో కార్యక్రమంలో 523 బూత్లు ఏర్పాటు చేశామన్నారు. దీనిలో ఐదేండ్లలోపు పిల్లలు 73450 మందికి చుక్కల మందు వేయనున్నట్లు తెలిపారు. దీనికి 53 రూట్లలో 53 మంది సూపర్ వైజర్లను నియమించామన్నారు. 28న, 1వ తేదీల్లో ప్రతి ఇంటికీ తిరిగి పిల్లలకు పోలియో చుక్కలు వేస్తారన్నారు.
– డాక్టర్ వెంకటేశ్వర్రావు, డీఎంహెచ్వో మెదక్