రామాయంపేట, ఫిబ్రవరి 1 : మనస్తాపంతో ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన రామాయంపేట మండలం దామరచెర్వు గ్రామంలో మంగళవారం తెల్లవారుజామున చోటు చేసుకుంది.
రామాయంపేట పోలీసుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన మంగళి లక్ష్మణ్(25) గత సంవత్సర కాలంగా భార్య కాపురానికి రాలేదంటు మద్యానికి బానిసై ప్రతిరోజు మద్యం తాగుతూ తిరిగేవాడని తెలిపారు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన మృతుడు లక్ష్మణ్ గ్రామ శివారులోని ఎర్రకుంట చెరువు వద్ద ఓ చెట్టుకు తాడుతో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలిపారు.
మృతుడి కుటుంబీకుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ దవాఖాన తరలించినట్లు పోలీసులు తెలిపారు.