జగదేవ్పూర్ ఫిబ్రవరి 8: సీఎం కేసీఆర్ పాలనలో రాష్ట్రం పచ్చని పంటలు.. లక్షలాది టన్నుల ధాన్యం రాశులతో కళకళలాడిందని, కాంగ్రెస్ వచ్చిన 60 రోజుల్లోనే రైతన్నలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఎఫ్డీసీ మాజీ చైర్మన్ వంటేరు ప్రతాప్రెడ్డి, డీసీసీబీ చైర్మన్ చిట్టిదేవేందర్రెడ్డి అన్నారు. గురువారం మండల కేంద్రంలోని పీఏసీఎస్ కార్యాలయంలో సీఎస్సీ సెంటర్తో పాటు అలిరాజ్పేటలో నూతనంగా నిర్మించిన రైతు సేవా కేంద్రాన్ని డీసీసీబీ చైర్మన్ చిట్టి దేవేందర్రెడ్డి మండల నాయకులతో కలసి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మాజీ సీఎం కేసీఆర్ రైతుల సంక్షేమానికి అనేక పథకాలను అమలు చేశారని, రైతు సేవా కేంద్రాలు ఏర్పాటు చేసి ఎరువులు, విత్తనాలు అందించారని తెలిపారు. సహకార సంఘాల ద్వారా అనేక మంది రైతులకు రుణాలు ఇచ్చారన్నారు. రైతుబంధు, రైతుబీమా పథకాలతో పాటు 24గంటల ఉచిత కరెంటు అందించామన్నారు.
కానీ, కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను పట్టించుకోవడం లేదని, ఎన్నికల్లో సమయంలో ప్రకటించిన రుణమాఫీ ఊసేలేదన్నారు. ఇప్పటికి రైతుబంధు డబ్బులు వేయలేదన్నారు. రైతు వ్యతిరేక విధానాలతో 40శాతం వరి సాగు తగ్గిందన్నారు. ఇప్పటికైనా ఇచ్చిన హామీలను అమలు చేసే దిశగా ప్రభుత్వం ఆలోచించాలన్నారు. కార్యక్రమంలో జడ్పీటీసీ సుధాకర్రెడ్డి, ఎంపీపీ బాలేశంగౌడ్, పీఏసీఎస్ చైర్మన్ ఇంద్రసేనారెడ్డి, ఆత్మకమిటీ మాజీ చైర్మన్ గుండా రంగారెడ్డి, ఎంపీటీసీల ఫోరం జిల్లా అధ్యక్షుడు కిరణ్గౌడ్, పార్టీ మండల అధ్యక్షుడు శ్రీనివాస్గౌడ్, ఎంపీటీసీ కవిత, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ ఉపేందర్రెడ్డి, సీనియర్ నాయకుడు యాదవరెడ్డి, మండల కో ఆప్షన్ సభ్యుడు ఎక్బాల్, నాయకులు కరుణాకర్, మల్లేశ్, పీఏసీఎస్ డైరెక్టర్లు భూమయ్య యశ్వంత్రెడ్డి, భాగ్యలక్ష్మి వెంకటచలమారెడ్డి, చంద్రశేఖర్, ఆయా గ్రామాల మాజీ సర్పంచ్లు, ఎంపీటీసీలు పాల్గొన్నారు.
తూప్రాన్, ఫిబ్రవరి 8 : ఆపత్కాలంలో కార్యకర్తలు, నాయకులకు బీఆర్ఎస్ పార్టీ అండగా నిలుస్తుందని ఎఫ్డీసీ మాజీ చైర్మన్ వంటేరు ప్రతాప్రెడ్డి అన్నారు. తూప్రాన్ మండలం ఇమాంపూర్ గ్రామానికి చెందిన బీఆర్ఎస్ కార్యకర్త గోదాల వెంకటేశ్ కొన్నిరోజుల క్రితం రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. పార్టీలో సభ్యత్వం ఉండటంతో ప్రమాదబీమా నుంచి మంజూరైన రూ. 2 లక్షల బీమా చెక్కును మృతుడి భార్య సరితకు గురువారం ఆయన అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గజ్వేల్ నియోజకవర్గంలో ఇప్పటివరకు ప్రమాదవశాత్తు మృతిచెందిన 325 కార్యకర్తల కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ. 2 లక్షల బీమా చెక్కులు అందజేసినట్లు తెలిపారు. కార్యక్రమంలో జడ్పీటీసీ రాణి సత్యనారాయణ, ఎంపీటీసీలు సంతోష్రెడ్డి, వెంకటేశ్గౌడ్, నాయకులు ఎల్లన్న, కృష్ణారెడ్డి, నర్సింహరెడ్డి, ఆంజనేయులుగౌడ్, బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.