కొల్చారం, నవంబర్ 29 : ఉపాధ్యాయులు సమాజ నిర్మా తలని, విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ చూపి, ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దాలని అదనపు కలెక్టర్ ప్రతిమాసింగ్ సూచించారు. కొల్చారంలోని కస్తూర్బాగాంధీ బాలికల రెసిడెన్షియల్ పాఠశా లను మంగళవారం జిల్లా విద్యాశాధికారి రమేశ్తో కలిసి ఆకస్మికంగా తనిఖీ చేశారు. తరగతి గదుల్లోకి వెళ్లి ‘తొలిమెట్టు’లో భాగంగా విద్యార్థులకు ఉపాధ్యాయులు బోధిస్తున్న విద్యా విధానాన్ని అదనపు కలెక్టర్ స్వయంగా పరిశీలించారు. విద్యార్థులకు బోధనోపకరణాల ద్వారా చేస్తున్న విద్యబోధనపై ఆరా తీశారు. బోధన అంశాలపై విద్యార్థులకు ప్రశ్నలు వేస్తూ సమాధానాలను రాబట్టారు. 6, 9వ తరగతి విద్యార్థులకు పలు ప్రశ్నలు వేశారు. 9, 10వ తరగతి విద్యార్థులపై ప్రత్యేక దృష్టి సారించాలని ఉపాధ్యాయులకు సూచించారు. విద్యార్థులకు నాణ్యతతో కూడిన మధ్యాహ్న భోజనం అందించాలని ఆదేశించారు.
విద్యార్థుల భవితకు బాట వేసే విధంగా విద్యా విధా నం కొనసాగాలన్నారు. పాఠశాలలో నెలకొన్న సమస్యలను స్వయంగా పరిశీలించారు. టాయిలెట్లు పూర్తిస్థాయిలో లేకపోవడం, వంటగది ఇరుకుగా ఉండడంపై అదనపు కలెక్టర్ మాట్లాడారు. సమస్యల పరిష్కారానికి అవసరమైన చర్యలు తీసుకో వాలని అధికారులకు సూచించారు. ప్రత్యామ్నాయ చర్యలపై పాఠశాల సిబ్బంది దృష్టి సారించాలన్నారు. అదనపు కలెక్టర్, జిల్లా విద్యాధికారి వెంట ఎంపీడీవో ప్రవీణ్కుమార్, పాఠశాల ప్రత్యేకాధికారి వినోదారాణి, పాఠశాల సిబ్బంది ఉన్నారు.
సబ్ జూనియర్ అథ్లెటిక్స్ పోటీలకు ఇందిరాగాంధీ స్టేడియంలో క్రీడాకారుల ఎంపిక
మెదక్ మున్సిపాలిటీ, నవంబర్ 29 : విద్యార్థులు చదువు తోపాటు క్రీడల్లో సైతం రాణించాలని ఇఫ్కో డైరెక్టర్ దేవేందర్రెడ్డి అన్నారు. జిల్లా కేంద్రంలోని ఇందిరాగాంధీ స్టేడియంలో 8వ తెలంగాణ సబ్ జూనియర్ అథ్లెటిక్స్ చాంపియన్షిప్-2022 ఎంపిక పోటీలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం క్రీడలకు భారీగా నిధు లు ఖర్చు చేస్తుందన్నారు. క్రీడాకారులకు పూర్తిగా సహకరిస్తానని ఆయన హామీ ఇచ్చారు. అన్ని పాఠశాలల్లో విద్యార్థులకు క్రీడాపోటీలు నిర్వహించాలని సూచించారు. అండర్- 8, 10, 12, 14, 16 విభాగాల్లో జరిగిన ఎంపికకు జిల్లా నుంచి 550 మంది క్రీడాకారులు పాల్గొనగా, పోటీలు నిర్వహించి, ఎంపిక చేశారు. ఎంపికల్లో జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి మధుసూదన్, మాస్టర్ అథ్లెటిక్స్ అసోసియేషన్ కార్యదర్శి శ్వేత, పీఈటీలు స్వాతి, చంటి, సుమన్ పాల్గొన్నారు.