కొమురవెల్లి, మార్చి 5 : సిద్దిపేట జిల్లా కొమురవెల్లి మండలం రసూలాబాద్కు చెందిన వల్లకాటి రవీందర్ కొమురవెల్లి మండల కేంద్రంలో ఫొటో స్టూడియో నిర్వహిస్తుండేవాడు. భార్య సునీత, పిల్లలతో సంతోషంగా జీవనం సాగిస్తుండగా ఆయన కుటుంబాన్ని కరోనా అతలాకుతలం చేసింది. 2021 ఏప్రిల్లో 2వ విడత కరోనా సమయంలో రవీందర్కు కరోనా బారినపడగా, హైదరాబాద్లోని ఒక దవాఖానలో చేర్పించారు. అక్కడ చికిత్స పొందుతూ పరిస్థితి విషమించి ఏప్రిల్ 20న మృతిచెందాడు. భర్త రవీందర్ మరణాన్ని దిగమింగి ధైర్యాన్ని తెచ్చుకుంది సునీతా. భర్త బతికి ఉన్నప్పుడు ఆయనకు చేదోడుగా ఉన్న సునీత, తన పిల్లల భవిష్యత్ కోసం భర్త వృత్తినే ఎంచుకొని అదే ఫొటో స్టూడియోలో ఫొటోగ్రాఫర్గా మారి ధైర్యంగా కుటుంబాన్ని నెట్టుకొస్తూ పలువురికి ఆదర్శంగా నిలుస్తున్నది.
ప్రస్తుతం కుమారుడు వినయ్ 9వ తరగతి, కుమార్తె మహాలక్ష్మి 8వ తరగతి చదువుతున్నారు. పిల్లలకు తండ్రి లేని లోటును తీరుస్తూ..తల్లి, తండ్రి అన్నీ తానై చూసుకుంటున్నది. నేటితరం మహిళలకు ఆమె ఆదర్శంగా చెప్పవచ్చు. విధి చిన్నచూపు చూసినా ధైర్యంతో జీవితంలో ముందడుగు వేస్తున్నది.