రాయపోల్ : హైదరాబాద్లో నిర్వహించిన రాష్ట్రస్థాయి భౌతిక శాస్త్ర ప్రతిభా పోటీల్లో ( Physics talent competition ) సిద్ధిపేట జిల్లా జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల రాంసాగర్ విద్యార్థిని కుమారి శ్రీనిధి ( Kumari Srinidhi ) సత్తా చాటింది . ఎస్సీఈఆర్టీ , ఫిజికల్ సైన్స్ ఫోరం సంయుక్త ఆధ్వర్యంలో రాష్ట్రస్థాయి పోటీలను నిర్వహించగా వందలాదిమంది విద్యార్థులు పాల్గొన్నారు.
ఈ పోటీలో సత్తా చాటి రాష్ట్రస్థాయిలో తృతీయ బహుమతిని కైవసం చేసుకున్న శ్రీనిధిని , గైడ్ టీచర్ నరేందర్ రెడ్డిని ప్రధానోపాధ్యాయులు రాజ్ కుమార్ అభినందించారు. అరుదైన విజయం పట్ల ఉపాధ్యాయులు యాదయ్య, నవీన్ కుమార్ , మహేష్ కుమార్ ,శ్యామ్ సుందర్ శర్మ, మంజుల , సుజాత , ఉమారాణి , పీఈటీ అనీఫ్, సీఆర్పీ స్వామి గౌడ్ అభినందించారు.