మెదక్, నవంబర్ 21 (నమస్తే తెలంగాణ) : ఎలాంటి అనుమానాలకు తావులేకుండా ఎన్నికల ప్రక్రియను పూర్తి పారదర్శకంగా నిర్వహించాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వికాస్ రాజ్ సూచించారు. రాష్ట్ర శాసనసభ -2023 ఎన్నికలను పురసరించుకుని మంగళవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జిల్లా కలెక్టర్లు, ఆయా నియోజకవర్గాల రిటర్నింగ్ అధికారులతో సీఈవో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాటాడుతూ 80 ఏండ్లు పైబడిన వృద్ధులు, 40శాతానికి పైగా వైకల్యం కలిగిన దివ్యాంగులకు వారివారి ఇండ్ల వద్ద నుంచే ఓటు హకు వినియోగించుకునేందుకు వీలుగా చేపట్టిన ఏర్పాట్ల గురించి ఆయా జిల్లాల ఎన్నికల అధికారుల వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఎన్నికల సిబ్బంది పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు హకు వినియోగించుకునేందుకు రిటర్నింగ్ అధికారుల కార్యాలయాల్లో ఏర్పాటు చేసిన ఫెసిలిటేషన్ సెంటర్లు, పోలింగ్, కౌంటింగ్ కోసం చేపట్టిన కసరత్తులు గురించి ఆరా తీశారు. పట్టణ ప్రాంతాల్లోని పోలింగ్ కేంద్రాల్లో వంద శాతం, గ్రామీణ ప్రాంతాల్లోని పోలింగ్ కేంద్రాల్లో 60 శాతం వెబ్ క్యాస్టింగ్ చేయాలని, మిగిలిన పోలింగ్ కేంద్రాల బయట సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని సీఈవో సూచించారు. నూతన ఓటర్లకు పోస్టల్శాఖ ద్వారా ఓటరు గుర్తింపు కార్డులు పంపిణీ జరిగేలా చర్యలు తీసుకోవాలని, వాటి వివరాలను సమర్పించాలన్నారు.
జిల్లాలో ప్రతి ఓటరుకు ఓటరు సమాచార స్లిప్పులు పంపిణీ చేయాలని, ప్రతి రోజూ ఓటరు సమాచార స్లిప్పుల పంపిణీపై నివేదిక అందించాలని, ప్రతి రోజూ నోడల్ అధికారి ద్వారా ఓటరు సమాచార స్లిప్పుల పంపిణీపై రివ్యూ నిర్వహించాలన్నారు. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో ఈవీఎం యంత్రాల ర్యాండమైజేషన్ పూర్తి చేయాలన్నారు. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో ఈవీఎం యంత్రాల డిస్ట్రిబ్యూషన్ కేం ద్రాలు, రిసెప్షన్ కేంద్రాల వద్ద పకాగా ఏర్పాట్లు చేయాలని, ఎలాంటి పొరపాట్లకు ఆసారం ఉండకూడదని హితవు పలికారు. ఎన్నికల ప్రచారానికి సంబంధించిన సమావేశాలు, సభలు నిర్వహించుకునేందుకు రాజకీయ పార్టీల ప్రతినిధుల, అభ్యర్థుల నుంచి సువిధ పోర్టల్ ద్వారా వచ్చే దరఖాస్తులకు ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ, నిర్ణీత గడువులో అనుమతులు మంజూరు చేయాలన్నారు. ఎన్నికల ప్రవర్తన నియమావళి ఉల్లంఘనలపై వచ్చే ఫిర్యాదులను తక్షణమే స్పందిస్తూ, ఎఫ్ఐఆర్ నమోదు చేయించాలని సూచించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్లో జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ రాజర్షి షా, అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు, డీఆర్వో పద్మశ్రీ, ఎన్నికల సిబ్బంది పాల్గొన్నారు.