సంగారెడ్డి కలెక్టరేట్, మే 9 : ఇంటర్మీడియట్ ఫలితాల్లో సంగారెడ్డి జిల్లాకు చెందిన విద్యార్థులు సత్తాను చాటారు. మంగళవారం విడుదలైన ఫలితాల్లో స్థానిక సెయింట్ ఆంథోనీస్ జూనియర్ కళాశాల విద్యార్థులు మరోసారి తమ ప్రతిభను రాష్ట్ర స్థాయిలో చాటారు. మొదటి సంవత్సరం ఎంపీసీ విభాగంలో మొత్తం 470 మార్కులకు 467 మార్కులతో ఎం శిల్ప రాష్ట్ర స్థాయిలో మొదటి స్థానంలో నిలిచింది. కళాశాలలో ఎంపీసీలో 470 మార్కులకు ఎం. శిల్ప 467, ఈ. శాంభవి 466, కె. వైశాలీ 465 మార్కులు సాధించగా, ద్వితీయ సంవత్సరంలో 1000 మార్కులకు బి. శివాణి 986 మార్కులు, జె. సంధ్య 977, సీహెచ్. భావన, పి. నందిని 972 మార్కులు సాధించారు. బైపీసీలో మొదటి సంవత్సరంలో మొత్తం 440 మార్కులకు కె. నందిని 434మార్కులు, బి.జాహ్నవి, ఎల్.కీర్తిశ్రీ, ఆర్.రిషికా 427 మార్కులు, హప్ఘామీనజ్ 424 సాధించారు.
ద్వితీయ సంవత్సరంలో ఆర్. నబీలా తహ్రీమ్ 981, షాఫిమా కౌసర్ 977, కావ్య, ప్రశాంతి 976 మార్కులు సాధించగా, సీఈసీ మొదటి సంవత్సరంలో 500 మార్కులకు మిస్సా మెహరీన్, బి. సుచి 469 మార్కులు, మధుమిత 457, స్నేహ 453 మార్కులు సాధించారు. ద్వితీయ సంవత్సరంలో అదీబా మహవీన్ 969, చరితాశ్రీ 964, తారా చౌదరి 923 మార్కులు సాధించారు. ఎంఈసీలో మొదటి సంవత్సరంలో దీపికా చౌదరి 483, అఫీపానజీనీన్ 781, లలితా చౌదరి 465 మార్కులు సాధించగా, ద్వితీయ సంవత్సరంలో బి.అక్షయ 977 మార్కులు, భవానీ 937, సుమన్ చౌదరి 930 మార్కులు సాధించారు. ఆయా విభాగాల్లో ఉత్తమ ఫలితాలు సాధించిన విజేతలను కళాశాల డైరెక్టర్ ఈ. సలోమాన్రెడ్డి, ప్రిన్సిపాల్ జ్యోతిరెడ్డి, జయబాలారెడ్డి, అధ్యాపకులు అభినందించారు.