గుమ్మడిదల, సెప్టెంబర్ 28 : శ్రీవారి బ్రహ్మోత్సవాలు కన్నుల పండువగా కొనసాగుతున్నాయి. మండల కేంద్రంలోని శ్రీదేవి భూదేవి సమేత కల్యాణ వేంకటేశ్వరస్వామి దేవాలయంలో ఆలయ వంశపారంపర్యకులు కేవీ. నర్సింహాచార్యులు, ఆలయ అధ్యక్షుడు మద్దుల బాల్రెడ్డి, ఉత్సవ కమిటీ అధ్యక్షుడు మల్లారెడ్డి ఆధ్వర్యంలో శ్రీవారి ఉత్సవాలను వైభవంగా నిర్వహిస్తున్నారు. బుధవారం కల్యాణ వేంకటేశ్వరస్వామి దేవాలయంలో శ్రీవారి శేషవాహనం పల్లకీ సేవలో పురవీధుల మీదుగా ఊరేగించారు. నేడు వేంకటేశ్వర స్వామి కల్యాణోత్సవాన్ని నిర్వహించనున్నట్లు ఉత్సవ కమిటీ అధ్యక్షుడు మల్లారెడ్డి తెలిపారు.
as festival