చేగుంట, జనవరి 20: పూర్వం గిరిజనుల చెరుకు బండ్ల వెంబడి వచ్చి వెలిసిన రేణుకమ్మ భక్తుల పూజలందుకుంటున్నదని స్థానికులు చెబుతుంటారు.ఈ ఆలయం చేగుంట మండలం కర్నాల్పల్లిలో ఉంది. మాఘ అమావాస్య సందర్భంగా కర్నాల్పల్లి రేణుకా జమదగ్నిల కల్యాణోత్సవం ఈనెల 21వ తేదీ శనివారం జరగనున్నది. కర్నాల్పల్లి గౌడ సంఘం, ఆలయ కమిటీ చైర్మన్ జనగామ రాములుగౌడ్, గ్రామస్తుల ఆధ్వర్యంలో జరిగేఈ ఉత్సవానికి ఏర్పాట్లు పూర్తయ్యాయి. జాతరకు జిల్లా నలుమూలల నుంచే కాకుండా హైదరాబాద్, మహారాష్ట్ర ప్రాంతాల నుంచి వేలాది మంది భక్తులు తరలివస్తారు. మాఘమ అమావాస్య సందర్భంగా శ్రీరేణుకా జమదగ్ని కల్యాణోత్సవం నిర్వహిస్తారు. అమ్మవారికి బోనాలు సమర్పిస్తారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొనాలని ఆలయ కమిటీ చైర్మన్ రాములుగౌడ్, వైస్ చైర్మన్ ప్రవీణ్ గౌడ్,గౌడ సంఘం నాయకులు కోరారు.