తూప్రాన్, డిసెంబర్ 25 : మెదక్ జిల్లా తూప్రాన్ మున్సిపాలిటీలోని వెంకటాపూర్ (పీటీ)లో కొలువైన శ్రీ లలితా పరమేశ్వరీ దేవీ ఆలయ ఉత్సవాలు ఈనెల 27నుంచి ప్రారంభం కా నున్నాయి. భక్తులు, దాతల సహకారంతో 2009లో శ్రీలలితా పరమేశ్వరీ దేవీ ఆలయానికి శంకుస్థాపన చేశారు. 2018 జూలై 4న అమ్మవారి విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. లలితా సేవా సమితి తూప్రాన్ వారి ఆధ్వర్యంలో లక్ష్మీ గణపతి, రుద్ర స్వాహకార పూర్వక సహస్ర చండీయాగ మహోత్సవాలు పంచాహ్నిక దీక్ష తో ఈనెల 27 నుంచి 31 వరకు నిర్వహించనున్న ఉత్సవాలకు అన్ని ఏర్పాట్లు పూర్తిచేశారు. ఈ ఉత్సవాలను వైభవంగా నిర్వహిస్తామని దేవీ ఉపాసకుడు సోమయాజుల రవీంద్ర వర్మ తెలిపారు.
ఉత్సవాలు ఇలా…