సిద్దిపేట టౌన్, జూన్ 25 : సిద్దిపేట పోలీసు కమిషనరేట్ రాష్ర్టానికే రోల్ మోడల్గా నిలువాలని సిద్దిపేట సీపీ జోయల్ డెవిస్ అన్నారు. నూ తన కమిషనరేట్లో విధులు నిర్వర్తిస్తున్న అధికారులు, సిబ్బందికి పంచసూత్రాల ఇంప్లిమెంటేషన్, ఈ ఆఫీసు, క్లీన్ అండ్ గ్రీన్పై శుక్రవారం అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ సీఎం కేసీఆర్ చేతుల మీదుగా మొట్టమొదటి పోలీసు కమిషనరేట్ ప్రారంభించుకోవడం అదృష్టమన్నారు. సిద్దిపేట కమిషనరేట్ పనితీరుచూసి మిగతా జిల్లాల వారు అమలుపర్చుకునే విధంగా మన పనితీరు ఉండాలన్నారు. ఆధునిక టెక్నాలజీతో ముందుకెళ్తూ నేరాలు నియంత్రించాలన్నారు. ప్రజలకు మెరుగైన సేవలు అందించడానికి ఎల్లప్పుడూ ముం దుండాలన్నారు. అడ్మినిస్ట్రేటివ్ విభాగం సేవలు మరింత మెరుగుపర్చుకోవాలన్నారు. సిద్దిపేట కమిషనరేట్ రాష్ర్టానికి ఆదర్శంగా ఉండేలా సేవలను కొనసాగించాలన్నారు. బిల్డింగ్ క్లీనింగ్ మెయింటనెన్స్ ఎవరికి వారు సొంతంగా తీసుకొని జోన్లవారీగా శుభ్రపర్చుకోవాలన్నారు. పంచసూత్రాల ఇంప్లిమెంటేషన్ రెండు మూడు రోజు ల్లో పూర్తి చేయాలని ఆదేశించారు. ప్రతిరోజు క్లీన్ అండ్గ్రీన్ మానిటరింగ్ చేయాలని, కార్యాలయాన్ని సొంత ఇంటిలా చూసుకోవాలన్నారు. కార్యక్రమంలో ఏవో సవిత, ఇన్స్పెక్టర్లు ప్రవీణ్కుమార్, యాలాద్రి, రామకృష్ణ, సూపరింటెండెంట్లు సిరాజుద్దీన్, వెంకటేశం, వివిధ విభాగాలకు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
పోలీసు శాఖ కీర్తిని పెంచాలి
ప్రజలతో మమేకమై మన్ననలు పొందినప్పుడే కష్టపడి సాధించిన ఉద్యోగానికి నిజమైన సార్థకత లభిస్తుందని సిద్దిపేట సీపీ జోయల్ డెవిస్ అన్నారు. 5 నెలల శిక్షణ కోసం కమిషనరేట్కు వచ్చిన 26 మంది ప్రొబెషనరీ ఎస్సైలకు చట్టాలు, విధివిధానాలపై శుక్రవారం సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ పోలీసు స్టేషన్ విధులపై శిక్షణ కాలంలో పూర్తిగా అవగాహన పెం చుకోవాలన్నారు. పోలీసులు ప్రజలతో మమేకమై విధులు నిర్వర్తించి సమస్యలు పరిష్కరించే అవకాశం రావడం అదృష్టంగా భావించాలన్నారు. పోలీస్ స్టేషన్కు వచ్చే బాధితుల సమస్యలను పరిష్కరించాలన్నారు. చట్ట ప్రకారం విధులు నిర్వరిస్తూ పోలీసు శాఖ కీర్తిని చాటాలని సూచించారు. ఆధునిక టెక్నాలజీని వినియోగిస్తూ తమదైన శైలిలో ముందుకెళ్లాలన్నారు. విచారణ, పరిశోధన, నిందితుల అరెస్టుల్లో జాగ్రత్తలు పాటించాలన్నారు. ఫ్రెండ్లీ పోలీసింగ్తో ప్రజలకు మరింత చేరువై సేవలందించాలని సూచించారు. అంతకు ముందు ప్రొబెషనరీ ఎస్సైల ఎడ్యుకేషన్, వారి వివరాలను అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో పోలీసు అధికారులు పాల్గొన్నారు.