రాయపోల్, ఏప్రిల్ 30 : దుబ్బాక శాసనసభ్యులు కొత్త ప్రభాకర్ రెడ్డి నూతన వధూవరులను ఆశీర్వదించారు. రాయపోల్ మండలంలోని కొత్తపల్లి గ్రామానికి చెందిన బీఆర్ఎస్ సీనియర్ కార్యకర్త నామసని రాజనర్సింలు కుమారుడి వివాహానికి వెళ్లిన ఆయన.. కొత్త జంటను నిండుమనసుతో దీవించారు.
మండల కేంద్రంలోని జీఎల్ఆర్ గార్డెన్లో బుధవారం నామసని రాజనర్సింలు కుమారుడి వివాహం జరిగింది. ఈ వివాహ వేడుకకు వెళ్లిన ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి నూతన వధూవరులను ఆశీర్వదించారు. ఆయన వెంట మండల బీఆర్ఎస్ ఉపాధ్యక్షులు కర్నాల సత్యనారాయణ. మాజీ జడ్పీటీసీ సభ్యులు లింగాయపల్లి యాదగిరి ఉన్నారు.
ఆద్యంతం వైభవంగా, సంబురంగా జరిగిన పెళ్లి వేడుకలో కొత్తపల్లి గ్రామ బీఆర్ఎస్ నాయకులు రాజారాం, మధు, బాల్ నర్సయ్య, బీఆర్ఎస్ రాష్ట్ర యువజన నాయకులు రాజిరెడ్డి. చేగుంట మండల బీఆర్ఎస్ సీనియర్ నాయకులు రంగయ్యగారి రాజిరెడ్డి, పలు గ్రామాలకు చెందిన బీఆర్ఎస్ పార్టీ నాయకులు, సర్పంచులు తదితరులు పాల్గొన్నారు.