కొండపాక(కుకునూరుపల్లి), ఏప్రిల్ 11: మీ కష్టసుఖాల్లో తోడుంటానని బీఆర్ఎస్ మెదక్ ఎంపీ అభ్యర్థి వెంకట్రామిరెడ్డి అన్నారు. గురువారం ఎఫ్డీసీ మాజీ చైర్మన్ వంటేరు ప్రతాప్రెడ్డితో కలిసి గజ్వేల్ నుంచి సిద్దిపేటకు వెళ్తూ మార్గమధ్యలో కుకునూరుపల్లి మండల కేంద్రంలో బీఆర్ఎస్ నాయకులతో కాసేపు మచ్చటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మెదక్ ఎంపీ అభ్యర్థిగా నిలిపారని, ప్రజలు, నాయకులు, కార్యకర్తల ఆశీర్వాదంతో గెలిచి మరింత సేవ చేస్తానన్నారు. కార్యక్రమంలో గజ్వేల్ మార్కెట్ కమిటీ చైర్మన్ మాదాసు శ్రీనివాస్, పీఎన్ఆర్ ట్రస్ట్ అధినేత పోల్కంపల్లి నరేందర్, పీఏసీఎస్ వైస్చైర్మన్ అమరేందర్ తదితరులు ఉన్నారు.