సిద్దిపేట కమాన్, ఫిబ్రవరి 11: సిద్దిపేట స్వచ్ఛ బడి బాగుందని, అక్కడ అనేక విషయాలు తెలుసుకున్నామని కేంద్ర అధికారుల బృందం కితాబిచ్చింది. సిద్దిపేట జిల్లాలో ఐదు రోజులుగా పర్యటిస్తున్న సెంట్రల్ సెక్రటేరియట్ సెక్షన్ ఆఫీసర్స్ 14 మందితో కూడిన బృందం చివరి రోజు ఆదివారం సిద్దిపేట పట్టణంలో పర్యటించారు. వారికి సిద్దిపేట స్వచ్ఛబడిలో మున్సిపల్ చైర్పర్సన్ కడవేర్గు మంజులారాజనర్సు, మున్సిపల్ కమిషనర్ సంపత్కుమార్ పుష్పగుచ్ఛాలు అందజేసి స్వాగతం పలికారు.
అనంతరం మున్సిపల్ కార్యాలయం, స్వచ్ఛ బడి, ఇంటిగ్రేటెడ్ మారెట్, సివియేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ (ఎస్టీటీ), బుస్సాపూర్ డంపింగ్ యార్డ్, డ్రై రిసోర్స్ కలెక్షన్ సెంటర్ (డీఆర్సీసీ)ను సందర్శించారు. మున్సిపల్ అడిషనల్ కమిషనర్ మల్లికార్జున్ సిద్దిపేట స్వచ్ఛ బడి వివరాలు ప్రొజెక్టర్ ద్వారా క్షుణ్ణంగా తెలియజేశారు. పట్టణంలో జరిగిన అభివృద్ధి, స్టీల్బ్యాంకు, రుతుప్రేమ తదితర కార్యక్రమాల గురించి బృందం తెలుసుకుని అభినందించింది. సిద్దిపేట కోమటి చెరువు అందాలకు బృందం ముగ్ధులైంది. కార్యక్రమంలో కౌన్సిలర్ గోపాలపురం దీప్తీ నాగరాజు, డీఆర్డీఏ అధికారులు, మున్సిపల్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.