మెదక్, మార్చి 30 (నమస్తే తెలంగాణ): సీఎం కేసీఆర్ సెర్ప్ ఉద్యోగుల జీవితాల్లో వెలుగు లు నింపారని ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి అన్నారు. గురువారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో సీఎం కేసీఆర్ చిత్రపటానికి సెర్ప్ ఉద్యోగులతో కలిసి ఎమ్మెల్యే క్షీరాభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా మెదక్ నియోజకవర్గంలోని సెర్ప్ ఉద్యోగులు సంబురాలు నిర్వహించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్రంలోని గ్రామీణ పేదరిక నిర్మూల సంస్థ ఉద్యోగులకు ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా పే-సేల్ను అమలు చేస్తూ సీఎం కేసీఆర్ ఉత్తర్వులు జారీ చేశా రని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు దేశంలోనే ఉత్తమ వేతనాలు ఇస్తున్నట్లు తెలిపారు. సీఎం కేసీఆర్, ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డికి సెర్ప్ ఉద్యోగులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేకు స్వీట్లు తినిపించారు. కార్యక్రమం లో ఏపీఎంలు సాయిలు, లక్ష్మీనారాయణ, వెంకటస్వామి, ఇందిర, భాసర్, రాములు, సీసీలు సాయిలు, యాదయ్య, రాజు, స్వామి, రాజు, దుర్గాభవాని పాల్గొన్నారు.